మెదక్ జిల్లాలో 59 ఫీజోమీటర్లు
నీళ్లు ఎంత లోతులో ఉన్నయో కచ్చితమైన సమాచారం తెలుసుకునే అవకాశం
అన్ని మండలాల్లో ఏర్పాటు
ప్రతి నెలా నీటి మట్టాలపై ప్రభుత్వానికి నివేదికలు
కాళేశ్వరం, సింగూరుతో పెరిగిన నీటి లభ్యత
వ్యవసాయం, గృహ, పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడం, ఉష్ణోగ్రతలు అధికమవుతుండడంతో భూగర్భ జలాలు సైతం అడుగంటిపోతున్నాయి. దీంతో ఏ ప్రాంతంలో నీళ్లున్నాయి.. అవి ఎంత లోతులో ఉన్నాయో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలతో పాటు క్లస్టర్గా గుర్తించి స్థానిక భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఫీజోమీటర్లను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం, సింగూరు జలాలతో ప్రస్తుతం జిల్లాలో నీటి మట్టాలు పెరిగిన క్రమంలో ఈ యంత్రాల ద్వారా ఆయా ప్రాంతాల్లో నీటి జాడకు సంబంధించి కచ్చితమైన సమాచారం తెలియనున్నది. తగినన్ని ఫీజోమీటర్లు లేక ఇబ్బందులేర్పడుతున్నాయని గతంలోనే భూగర్భ జలశాఖ నివేదిక పంపగా, ప్రభుత్వం అదనపు పరికరాలను మంజూరు చేసింది. కాగా, నీటిని పొదుపుగా వాడాలని, రైతులు ఎక్కువగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.
మెదక్, మే 9 : ఇక నుంచి భూగర్భ జలాల లెక్కిం పు పరిశీలన మరింత పారదర్శకంగా మారనుంది. మండలాలు, గ్రామా లు పరిధిలో ప్రతి నెలా భూ గర్భ జల మట్టం లెక్కించి ప్రభుత్వానికి నివేదికలను పంపిస్తారు. గతంలో నీటి జాడలను తెలుసుకునేందుకు సరిపడా యంత్రాలు లేకపోవడంతో అందుబాటులో ఉన్న పరికరాలతో వచ్చే రిపోర్టును పరిగణిలోకి తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఫీజోమీటర్ల(నీటి లోతును లెక్కించే ఆధునిక యంత్రాలు)లతో నీటి జాడలను లెక్కించనున్నారు.
మెదక్ జిల్లాలో 59 ఫీజోమీటర్లు..
మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో మూడు ఫీజోమీటర్లను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తం గా 31 ఫీజోమీటర్లు ఏర్పాటు చేశారు. మండలాల కేంద్రాలతో పాటు క్లస్టర్గా గుర్తించి గ్రామ శివారుల్లో వీటిని ఏర్పాటు చేశారు. అయితే ప్రతి నెల 22 నుంచి 28వ తేదీలోపు భూగర్భ జలాల లోతును లెక్కిస్తారు. గతంలో ఫీజోమీటర్లు పూర్తి స్థాయి లో లేకపోవడంతో ఉన్న యంత్రాలతోనే సరిపెట్టుకొచ్చారు. అదనపు పరికరాల కోసం భూగర్భ జలాల శాఖ అధికారులు ప్రభుత్వానికి గతంలోనే నివేదికలు పంపించారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మెదక్ జిల్లాలో కాళేశ్వరం జలా లు, సింగూరు నీటితో సస్యశ్యామలంగా మారింది. దీంతో ఆశించిన దానికంటే భూగర్భ జలాలు పెరిగాయి. నీటి వృథాను అరికట్టి ఇంకుడు గుంతల ద్వారా వరద నీరును భూగర్భంలోకి పంపించి నీటి మట్టాన్ని పెంచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో పెరిగిన భూ గర్భ నీటి మట్టంతో వ్యవసాయ బోర్లు, బావుల పరిధిలో సాగు కు మరింత ఉపయోగకరంగా మారింది. వ్యవసాయ బావుల వద్ద కూరగాయలు, పండ్ల తోటలు, వరి, ఇతర పంటలను రైతు లు సాగు చేశారు. ఇప్పటికే 1.67లక్షల ఎకరాలకుపైగా వరి సాగు చేయగా, మరికొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న, పత్తి పంట లు వేశారు.
28 చోట్ల ఏర్పాటు..
మెదక్ జిల్లాలోని 21మండలాల పరిధిలో జిల్లాలో భూగర్భ జల మట్టం నిర్ధారణ కోసం ప్రభుత్వం కొత్తగా ఎంపిక చేసిన 28గ్రామాల పరిధిలో ఆధునిక ఫీజో మీటర్లను ఏర్పాటు చేశా రు. భౌగోళిక పరిస్థితులను అంచనా వేసి నూతన పరికరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 59 ఫీజో మీటర్ల ద్వారా భూగర్భ జలాల లోతును పరిశీలిస్తున్న అధికారులు ఏప్రిల్ నెల నుంచి పెరిగిన వాటితో కలుపుకొని ఫీజో మీటర్ల ద్వారా ఖచ్చితమైన రిపోర్టును గుర్తించనున్నారు. ఇప్పటి వరకు ఈ జాబితాలో లేని గ్రామాలు కూడా ఇందులో కలువనున్నాయి.
జిల్లాలో 59 ఫీజోమీటర్లు ఏర్పాటు..
మెదక్ జిల్లాలో 59 ఫీజోమీటర్లు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 59ఫీజో మీటర్ల ద్వారా భూగర్భ జలాల లో తును పరిశీలిస్తు న్నాం. ఏప్రిల్ నెల నుంచి పెరిగిన వాటితో కలుపుకొని ఫీజో మీటర్ల ద్వారా ఖచ్చితమైన రిపోర్టును గుర్తిస్తున్నాం. జిల్లాలో నీటిని పొదుపుగా వాడాలి. రైతులు ఎక్కువగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలి.
– లావణ్య, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి