పాపన్నపేట, ఆగస్టు 7 :సెప్టెంబర్ 1న ఇందిరా పార్కు వద్ద హైదరాబాదులో నిర్వహించే మహా ధర్నాకు జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం ఏడుపాయల వన దుర్గ భవాని మాతను దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ ధర్నా నిర్వహించ తలపెట్టామని, ఈ కార్యక్రమానికి కనివిని ఎరుగని రీతిలో ఉపాధ్యాయులు హాజరు కావాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పి ఆర్ సి నివేదికను వెంటనే తెప్పించుకొని ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించాలని కోరారు. ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏలను సత్వరమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఓ పి ఎస్ ను అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. సిపిఎస్ ఉపాధ్యాయుల చిరకాల కోరిక అయినా ఓ పి ఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులగం దామోదర్ రెడ్డి, సుంకరి బిక్షం గౌడ్, మోహన్ రెడ్డి, పి ఆర్ టి యు టి ఎస్ అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేడి సతీష్ రావు, సామ్యా నాయక్ మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు సబ్బని శ్రీనివాస్ రాష్ట్ర ,జిల్లా, మండల బాధ్యులు సత్నారాయణరెడ్డి,వెంకటరామిరెడ్డి, మహేశ్,రామచంద్రాచారి, రాజు, సురేష్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.