స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జయభేరి మోగిస్తోంది. ఇప్పటికే నల్గొండ, ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఇదే క్రమంలో మెదక్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు.
ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డికి 762 ఓట్ల వచ్చాయి. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థికి 238 ఓట్లే పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఆరు ఓట్లే వచ్చాయి. మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 12 ఓట్లు చెల్లనివిగా తేలాయి.