సంగారెడ్డి, ఫిబ్రవరి11: సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావును ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. శనివారం అసెంబ్లీలోని మంత్రి చాంబర్లో కలిసి నిధులు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. వినతిలో నియోజక వర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.75.50 కోట్ల నిధులు కావాల్సి ఉందని విన్నవించారు.
ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కిషన్గుప్తా, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు హరీశ్ గుప్తా ఉన్నారు.