మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 30 : జిల్లా కేంద్రంలోని దయార రోడ్డుకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషితో ప్రభుత్వం రూ. 7.80 కోట్లు మంజూరు చేసిందని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాయంలో ఆయన మాట్లాడారు. మంజూరైన నిధులతో పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుంచి గాంధీనగర్ వరకు 2.5 కి.మీటర్ల రోడ్డు నిర్మాణం చేపడుతామన్నారు. నిధుల మంజూరునకు కృషి చేసిన ఎమ్మెల్యే రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, మున్సిపల్ శాఖ మం త్రి కేటీఆర్, జిల్లా ఇన్చార్జి మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దు : ఇంటిగ్రేటెడ్ మార్కెట్ విషయం లో సోషల్ మీడియాలో వచ్చే మాటలు నమ్మొద్దని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ పట్టణ ప్రజలకు సూచించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ జూనియర్ కళాశాల మైదానంలో వద్దంటూ కొందరు కోర్టుకు వెళ్లడంపై మా ర్కెట్ను నీటిపారుదల శాఖ కార్యాలయ ఆవరణలోని స్థలంలో రూ. 4.70 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.