మెదక్ రూరల్ జూన్ 5: మనిషి పుట్టుక నుంచి చావుదాకా ఆలోచిస్తూ విభిన్న కార్యక్రమాలు అమలుచేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ అన్నారు. సోమవారం స్థ్ధానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాస్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు ఓర్పు, సహనం ఎక్కువని, వారి సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి పలు ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేస్తుందన్నారు. నాడు ఊర్లోకెళ్లాలంటే గతుకుల రోడ్లు, ఖాళీబిందెలతో మహిళలు అడ్డుపడేవారన్నారు. నేడు మాత్రం నీళ్లయుద్ధాలు, కరెంటు గోస లేదన్నారు. వలసవెళ్లినవారు తిరిగి వస్తున్నారని, నేడు కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల గ్రామాలకు కల వచ్చిందన్నారు. పేదింటి ఆడబిడ్డల పండ్లికి ఆర్థికసాయం, వైద్యరంగాన్ని మెరుగుపర్చి డయాగ్నొస్టిక్స్, టీపాస్కానింగ్ వంటి సౌకర్యాలు కల్పించడంతో నేడు అధికశాతం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయన్నారు.
నాడు నేనురాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేవారు నేడు నేనుపోత బిడ్డో సర్కారు దవాఖానకు అని అంటున్నారని మంత్రి తెలిపారు. ఈనెలలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందజేయనున్నామన్నారు. ఆరోగ్యలక్ష్మీతో గర్భిణులకు పాలు,గుడ్లు అందజేస్తున్నామన్నారు. మహిళా సమాఖ్యా బలోపేతానికి స్థలం కేటాయించామని, మంజీరా పేర ఉత్పత్తులను విక్రయించుటకు, అద్దెలతో ఆదాయం సంపాదించుటకు భవనంతోపాటు దుకాణసముదాయాలను రూ. కోటితో నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా 280 మహిళా సంఘాలకు రూ.23 కోట్ల 51 లక్షల చెక్కును మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాస్రెడ్డితో కలిసి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మహిళలకు కొండంత భరోసా కల్పించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
డీసీసీబీ ప్రారంభం
రైతుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన డీసీసీబీ బ్యాంకును మంత్రి ప్రారంభించారు . కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా, ఇఫ్కో డైరక్టర్ దేవేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, మేనేజర్ వేణుగోపాల్రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్, ఆర్డీవో సాయిరాం, ఎంపీపీ యమున, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, డీసీసీబీ డైరెక్టర్ హన్ముంత్రెడ్డి, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, అడిషనల్ డీఆర్డీవో బీమయ్య, జిల్లాప్రాజెక్టు అధికారి మోహన్, డీపీఎంలు సురేశ్, ప్రకాశ్, జిల్లా సమాఖ్య సభ్యులు లక్ష్మాజ్యోతి , తులసీ, అధ్యక్షురాలు నవనీత, మెదక్ మండల ప్రాజెక్టు అధికారి ఇందిర, ప్రజాప్రతినిథులు, నాయకులు ఉన్నారు.