వెల్దుర్తి/ నిజాంపేట, జూన్ 2 : అన్ని వర్గాల సహకారంతో దశాబ్ది ఉత్సవాలను జిల్లాల్లో విజయవంతం చేయాలని అధికారులు, నాయకులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి సూచించారు. శనివారం నిర్వహించే రైతు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను శుక్రవారం వెల్దుర్తి రైతువేదిక వద్ద ఎమ్మెల్యే మదన్రెడ్డి, అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతువేదిక వద్ద నిర్వహించే వేడుకలకు భారీగా రైతులు, మహిళలు వచ్చేలా చూడాలన్నారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భోజనాలతోపాటు తాగునీటి వసతి, టెంట్లు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాన్ని సిద్ధ్దం చేయాలని సూచించారు. వెల్దుర్తితోపాటు కుకునూర్, మంగళపర్తి, బండపోసాన్పల్లి, హస్తాల్పూర్, మాసాయిపేటలో సైతం రైతు ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు.
నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా నిర్వహించనున్న రైతు దినోత్సవ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు రైతుబంధు సమితి మం డల కో-ఆర్డినేటర్ బిజ్జ సంపత్ తెలిపారు. తహసీల్దార్ ప్రభాకర్తో కలిసి రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. రైతుల సమావేశం, సహపంక్తి భోజనాలకు అనుకూలమైన నస్కల్ పెద్దమ్మతల్లి ఆలయ ఆ వరణ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్ఐ గంగాధర్గౌడ్, ఏఈవో గణేశ్కుమార్, బీఆర్ఎస్ నాయకులు దుర్గయ్య, రాజు, విజయ్, గ్రామస్తులు ఉన్నారు.