దుబ్బాక, జూలై 9: సిద్దిపేట జిల్లా దుబ్బాక ని యోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి చేనేత సొసైటీ చైర్మన్, పాలకవర్గ సభ్యులను సన్మానించారు. ఆనంతరం పట్టణంలో కోర్టు భవనానికి దుంపలపల్లి రోడ్డులో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దుబ్బాక అభివృద్ధికి నిత్యం పాటుపడుతున్నామన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడులో దుబ్బాక నియోజకవర్గానికి పెద్దపీట వేసినట్లు గుర్తుచేశారు.
దుబ్బాకకు యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరయ్యిందన్నారు. చేనేత సహకార ఎన్నికల్లో దుబ్బాక చేనేతలు ఐక్యత చాటుకున్నారని ఎమ్మెల్యే అభినందించారు. సొసైటీ చైర్మన్ అంకం మధు, ఆయన పాలకవర్గాన్ని అభినందించా రు. దుబ్బాక చేనేతలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోరారు. వానకాలంలో సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నీటి ట్యాంకులు శుభ్రపరిచి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, మురుగు కాల్వలలో చెత్తా చెదారం,పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని సూచించారు.
దుబ్బాక నియోజకవర్గంలో రైతులకు సరిపడా యూరియా, డీఏపీ వంటి ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ విషయంలో సంబంధిత మంత్రి, అధికారులతో చర్చించినట్లు తెలిపారు. మండలాల్లో ఆగ్రోస్, ఇతర ఎరువుల దుకాణాల్లో యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.