దుబ్బాక, జనవరి 22: దుబ్బాక నియోజకవర్గంలోని రహదారులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు. ఆదివారం రాత్రి ఆర్అండ్బీ (రోడ్డు, భవనాల) శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఆయన కలిశారు. ఈ విషయంపై సోమవారం ఆయన దుబ్బాక విలేకరులకు ఫోన్లో వివరించారు. దుబ్బాక నియోజకవర్గంలో మెట్టు-దౌల్తాబాద్ హైలేవల్ బ్రిడ్జితోపాటు వయా పద్మనాభంపల్లి , తిమ్మాపూర్ వరకు రోడ్డు నిర్మాణానికి సీఆర్ఎఫ్ నిధులు రూ.25 కోట్లు విడుదల చేయాలని కోరారు.
మొండిచింత-బేగంపేట వరకు ఉన్న సింగల్ రోడ్డును డబుల్గా విస్తరించేందుకు రూ. 7 కోట్లు మంజూరు చేయాలన్నారు. చేగుంట-బోనాల రోడ్డు నిర్మాణానికి రూ.70 లక్షలు మంజూరు చేయాలని మంత్రికి విన్నవించినట్లు తెలిపారు. సుమారు రూ.33 కోట్లతో పలు రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు మంత్రికి అందించానన్నారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.