చేగుంట, జూన్ 8: దుర్గామాత, బీరప్ప ప్రజలను చల్లగా చూడాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు. సోమవారం మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేటలో దుర్గామాత జాతర, కర్నాల్పల్లిలో బీరప్ప ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చందాయిపేట ఆలయ కమిటీ సభ్యులు, కర్నాల్పల్లి బీరప్ప దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు.
జారతలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కాంగ్రెస్ దుబ్బాక నాయకులు చెరుకు శ్రీనివాస్రెడ్డి, వడ్ల నవీన్, సాయికుమార్గౌడ్, సండ్రుగు శ్రీకాంత్ అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మమేశ్వరీసాయిబాబా, జనగామ దుర్గారాములుగౌడ్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్, స్థానిక నాయకులు నగేశ్, శ్రీనివాస్, పరంజ్యోతి, శేఖర్, నారాయణరెడ్డి, మోహన్రెడ్డి, రాజ్గోపాల్, రణంశ్రీనివాస్గౌడ్, నాగరాజు, శ్రీకాంత్, మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.