దుబ్బాక, డిసెంబర్19: అభివృద్ధికి దిక్సూచి రహదారులు అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. పెరుగుతున్న వాహనాల వినియోగంతో ట్రాఫిక్ సమస్యలు నెలకొంటున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులు నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణ పనులతో పాటు నూతన రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్అండ్బీశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లో ఆర్అండ్బీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్ల స్థితిగతులు, నూతనంగా నిర్మించేందుకు రోడ్ల ప్రతిపాదనలపై ఆయన చర్చించారు. దుబ్బాక పట్టణంలో ట్రాఫిక్ సమస్య నెలకొన్నందున పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మాణం చాలా అవసరమని గుర్తించారు. దుబ్బాక మండలం హబ్షీపూర్ నుంచి దుబ్బాక వరకు ఉన్న డబుల్ రోడ్డును నాలుగులేన్ల రోడ్డుగా, మిరుదొడ్డి మండలం అందె నుంచి దుబ్బాక మండలం తిమ్మాపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలతో రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆయన సూచించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ బాలప్రసాద్, దుబ్బాక డీఈ వెంకటేశం, దౌల్తాబాద్ ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
చేగుంట, డిసెంబర్ 19: ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి గెలువడంతో బీఆర్ఎస్ జిల్లా నాయకు లు రంగయ్యగారి రాజిరెడ్డితో పాటు పలువురు తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి మొక్కుతీర్చుకున్నారు. ఈ సందర్భం గా వారు మంగళవారం దుబ్బాకలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సన్మానించి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని ఎమ్మెల్యేకు అందజేసి అభినందనలు తెలిపా రు. కార్యక్రమంలో రంగయ్యగారి రాజిరెడ్డితో పాటు రైతుబంధు జిల్లా డైరెక్టర్ చేర్యాల మోహన్రెడ్డి, ఇబ్రహీంపూర్ సొసైటీ మాజీ చైర్మన్ కోమండ్ల నారాయణరెడ్డి, నాయకులు కాశబోయిన సుదర్శన్, డీ రాజు తదితరులున్నారు.