జహీరాబాద్, డిసెంబర్ 10 : కార్యకర్తలు అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ప్రజాతీర్పును గౌరవించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. ఆదివారం జహీరాబాద్ మండలంలోని అర్జున్నాయక్తండాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని, ప్రజలు గుర్తించి జహీరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారన్నారు. నాయకులు, కార్యకర్తలు ఎవరు నిరాశతో ఉండొద్దని, ధైర్యంతో ముందుండి పార్టీ ప్రతిష్టత కోసం పని చేయాలన్నారు. కార్యకర్తలకు, నాయకులకు నేను ఎప్పుడు వెన్నం సెల్ అధ్యక్షులు హీరు రాథోడ్, బీఆర్ఎస్ నాయకుడు గులంసింగ్ ఉన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేటే ఉంటానని, తన గెలు పు కోసం పని చేసిన వారందరికీ రుణపడి ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో జహీరాబాద్ మండల బీఆర్ఎస్ ఎస్టీమ పథకాలు ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మాణిక్రావు తెలిపారు. ఆదివారం జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మాట్లాడా రు. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆర్టీసీ అధికారులు మహిళల కోసం బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు.
ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం ఆరోగ్యశ్రీని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం. శివకుమార్, ఆర్టీసీ డిపో మేనేజరు సూర్యనారాయణ, డిప్యూటీ డిఎంఅండ్హెచ్వో డాక్టర్ శంకర్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో సుమతి, వైద్యులు శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.