జహీరాబాద్, ఫిబ్రవరి 23: సమస్యలు పరిష్కరించే విధంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కృషి చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు శాలువా కప్పి పూలమాలతో ఆయన సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన స్ఫూర్తితో వార్డుల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలన్నారు.
ప్రజాసేవకు అంకితమై భవిష్యత్లో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పట్టణంలోని వార్డుల అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యాకూబ్, విశ్వేశ్వర్, అబ్దుల్ల్లా, కౌన్సిలర్లు తంజీమ్, గౌస్గోరీ, స్వప్న, ప్రేమలత, పాండర, ఎర్రోళ్ల దీపక్, విజయ, పర్విన్ జహన్, జాకిర్, స్రవంతి, జహేద్అలీ, సుజిత, పర్విన్బేగం, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.