జహీరాబాద్, డిసెంబర్ 28 : ప్రభుత్వం అర్హులందరికీ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ప్రభు వీధిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అర్హులైన లబ్ధిదారులు ఆరు గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. లబ్ధిదారులు దరఖాస్తు సమర్పించే సమయంలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్లు జాతచేయాలన్నారు. దరఖాస్తు చేసిన వారు తప్పుకుండా రసీదులు తీసుకోవాలన్నారు. జహీరాబాద్ మండలంలోని చెరాగ్పల్లి, కొత్తూర్(బి) గ్రామాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సుభాశ్రా వు, జహీరాబాద్ ఆర్డీవో వెంకారెడ్డి, మండల ప్రత్యేక అధికారి వసంతకుమారి, ఎంపీపీ గిరిధర్రెడ్డి, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో సుమతి, ఎంపీవో మహేశ్వర్రావు, వివిధ పార్టీల నాయకులు, మొగుడంపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి సీతారామరాజు, అధికారులు పాల్గొన్నారు.