సిద్దిపేట,డిసెంబర్ 24: మార్చిలో జరిగే టెన్త్ వార్షిక పరీక్షలకు సంబంధించి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదివించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పదోతరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉత్తరం రాశారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రియమైన విద్యార్థులారా….తల్లిదండ్రులా రా….ఈ ప్రపంచంలో హాని కలిగించని వ్యసనం ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమేనన్నారు. నిరుపేద కుటుంబాల్లో జన్మించి దేశాలను పాలించే స్థాయికి ఎదిగినవారు కొందరైతే.. నేటి సాంకేతిక యుగానికి సంసరణలు రచించినవారు ఇంకెందరో ఉన్నారన్నా రు.. ప్రణాళికాబద్ధమైన చదువు తలరాతనే మారుస్తుందనడానికి ఎన్నో సజీవసాక్ష్యాలు మన కండ్లముందు ఉన్నాయన్నారు.
ఈ విషయాలను విద్యార్థుల తల్లిదండ్రులతో పంచుకోవడానికి ఇదే సరైన సందర్భంగా భావిస్తున్నానని ఆయన కొన్ని విలువైన అంశాలు ఉత్తరంలో రాశారు. మరి కొద్ది రోజుల్లోనే మీ పిల్లలు పదోతరగతి పరీక్షలు రాయబోతున్నారు. వారి చదువులో ఇది అత్యంత కీలకమైన ఘట్టం. ఇది అధిక మారులతో గట్టెకితేనే ఉన్నత చదువుల దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంటుం ది లేదంటే మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి, మీ పిల్లల చదువుకు ఎలాంటి అర్థం ఉండదన్నారు. మీ పిల్లలు చదువుల్లో విజయం సాధించాక మీరిచ్చే అభినందన కన్నా మీ పిల్లలు పరీక్షలు రాసే ముందు మీరు తీసుకునే ప్రత్యేక శ్రద్ధ ఎంతో ముఖ్యమన్నారు. వార్షిక పరీక్షలు ముగిసేదాకా పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి, విందులు, వినోదాలు, ఫంక్షన్లు, సినిమాలు, టీవీల జోలికి వెళ్లకుండా చూడాలన్నారు.
మీ ఇంటికి సంబంధించిన పనులను కూడా చెప్పవద్దని కోరారు. పోటీ ప్రపంచంలో సాదాసీదాగా కాకుండా ప్రతిభను చాటితేనే మంచి అవకాశాలు వస్తున్నాయన్నారు. మీ ఆశలకు, మీ పిల్లల ఆశయాలకు మధ్య వారథిగా నేను నిలువాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నాలుగేళ్లుగా సిద్దిపేట నియోజకవర్గంలో చదివిన టెన్త్ విద్యార్థులంతా అత్యధిక మారులు సాధిస్తున్నారన్నారు. నూటికి నూరుశాతం పాసవుతున్నారని గుర్తుచేశారు. ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలోనూ 169 మంది సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థులు గత ఏడాది సీట్లు సాధించడం గర్వకారణమన్నారు.
ఉచిత ఇంజినీరింగ్ విద్యతోపాటు అధిక ఉద్యోగాలు దకించుకుంటున్నారన్నారు. నా వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులతో పాటు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నానని, జిల్లా విద్యాధికారి నుంచి మీ పిల్లలకు చదువు చెప్పే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కూడా సమీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. సూళ్లలో డిజిటల్ క్లాస్లు, మోడల్ టాయిలెట్స్ తదితర సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. మారు లు పెరిగిందుకు డిజిటల్ కంటెంట్ పుస్తకాలు పంపిస్తున్నాను, ఈ పుస్తకాల ద్వారా ప్రతి సబ్జెక్టుపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో కూడా ఆదర్శంగా నిలువాలనేదే నా తాపత్రయమన్నారు. ప్రజాప్రతినిధిగా, మీ కుటుంబం లో ఒకడిగా నా వంతు ప్రయత్నం చేస్తున్నానని, మీ పిల్లల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని ఉత్తరంలో హరీశ్రావు తెలిపారు.