సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 29 : హనుమాన్ దీక్ష.. భిక్షకు సిద్దిపేట నెలవు అని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నా రు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం జరిగిన హనుమాన్ మాలధారణ స్వా ముల భిక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావు ఆంజనేయ స్వామి వారి ని దర్శించుకొని పూజలు చేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఆలయాల కిల్లా సిద్దిపేట అని.. హనుమాన్ దీక్ష మొదట ప్రారంభమైందన్నారు.
ఆస్ఫూర్తితో హనుమాన్ మాల ధారణ స్వాముల భిక్ష ఇక్కడి నుంచి మొదలు కావడం గొప్ప విషయమన్నారు.సిద్దిపేట హనుమాన్ నామ స్మరణతో మార్మోగుతుందని.స్వాముల సిద్ధి సంకల్పం సఫలం కావాలని కోరుకున్నారు.
స్వాముల భిక్షకు ప్రతి ఏటా లక్ష విరాళం గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మాలధారణ స్వాములకు 21 రోజుల పాటు భిక్ష కార్యక్రమం జరుగుతుంది. అందుకుగాను మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు ప్రతి ఏటా తన వంతు విరాళంగా లక్ష రూపాయలను అందిస్తున్నారు.స్వాముల భిక్షకు యథావిధిగా రూ.లక్ష రూపాయలను ఆలయ నిర్వాహకులను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ప్రజా పతినిధులు, భక్తులు పాల్గొన్నారు.