మెదక్, (నమస్తే తెలంగాణ)/ రామాయంపేట/ నర్సాపూర్, మార్చి 31: రాష్ట్రస్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన గ్రామాలకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్రావు అవార్డులు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ స్టేట్ వికాస్ పురసార్ కింద 9 అంశాల్లో ఉత్తమ గ్రామ పంచాయతీలకు పురసారాలు ప్రకటించింది. ప్రజలకు సుపరిపాలన అందించడంలో విశేష కృషి చేసినందుకు చిప్పల్తుర్తికి, చిన్న పిల్లల సంరక్షణ, బర్త్ డే సెలబ్రేషన్స్, ఆడపిల్లలకు గ్రామ పంచాయతీ నుంచే సుకన్య సమృద్ధి యోజన పథకానికి ఆర్థిక చేయూత అందించినందుకు డి.ధర్మారం గ్రామాలు ఎంపికయ్యాయి.
శుక్రవారం హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు శ్యామలాలక్ష్మణ్గౌడ్, బొడ్డు శంకర్, కార్యదర్శులకు సురేఖ, మహేందర్రెడ్డిలకు అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జడ్పీ సీఈవో వెంకట శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబ సమక్షంలో మంత్రులు ఈ దీన్ దయాళ్ అవార్డులను అందజేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషి ఫలితంగా ఈ అవార్డులు పొందడం సంతోషంగా ఉందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
హరిదాస్పూర్కు అవార్డు
కొండాపూర్, మార్చి 31: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని హరిదాస్పూర్ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు సొంతం చేసుకున్నది. చిన్న పిల్లల సంరక్షణ, ఆడపిల్లల కోసం వినూత్న కార్యక్రమా చేస్తున్నందుకు ఈ గ్రామం పురస్కరానికి ఎంపికయ్యింది. శుక్రవారం సర్పంచ్ ఎండీ షఫీకి అవార్డు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, జడ్పీసీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి రోహిత్కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.