హుస్నాబాద్, జనవరి 8: హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం గృహప్రవేశం చేశారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మంత్రి సతీసమేతంగా పాల్గొన్నారు. అనంతరం స్థానిక కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు.
ఇక నుంచి క్యాంపు కార్యాలయం నుంచే నియోజకవర్గ పాలనా వ్యవస్థను చూడటం జరుగుతుందని మంత్రి తెలిపారు. కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేరుగా తన క్యాంపు కార్యాలయానికి వచ్చి కలువొచ్చన్నారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నాయకులు అయిలయ్య, కల్లెపల్లి వెంకటస్వామి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.