నర్సాపూర్, నవంబర్ 25: బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తరుఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు నేడు నర్సాపూర్ పట్టణానికి రానున్నారు. నర్సాపూర్లో మంత్రి కేటీఆర్ రోడ్షోలో పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తరుఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
ఈ రోడ్షో కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి కోరారు. రోడ్ షోకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జి వెంకట్రామ్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి హెలిప్యాడ్ను పరిశీలించారు. ఆయనతోపాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అశోక్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, నాయకులు గాలి అనిల్కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.