పేదల సుస్తీని నయం చేసే బస్తీ దవాఖానలు నేడు దోస్తీ దవాఖానలుగా మారాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో వంద పడకల దవాఖానలో డయాలసిస్ సెంటర్, డబుల్ బెడ్రూమ్ కాలనీ వద్ద బస్తీ దవాఖానను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డయాలసిస్ సెంటర్ కిడ్నీ రోగులకు వరంగా మారిందన్నారు. గతంలో దుబ్బాక నుంచి సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల లాంటి దూర ప్రాంతాలకు వెళ్లి రోగులు ఇబ్బందులు పడ్డారన్నారు. దుబ్బాకలో వంద పడకల దవాఖానను బలోపేతం చేస్తామన్నారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి పేదలు డబ్బులు వృథా చేసుకోవద్దని మంత్రి సూచించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను ఇష్టారాజ్యంగా కార్పొరేట్లకు విక్రయించడం తగదన్నారు. మళ్లీ యాసంగిలో ధాన్యం కొనమని కేంద్రం మెలికపెట్టడం సిగ్గుచేటన్నారు.
దుబ్బాక /దుబ్బాక టౌన్, మార్చి 5 : పేదల సుస్తీని నయం చేసే బస్తీ దవాఖానలు రాష్ట్రంలో దోస్తీ దవాఖానలుగా మారాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. దుబ్బాక పట్టణంలో ఆదివారం ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్హుస్సేన్, యాదవరెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్రావుతో కలిసి వంద పడకల దవాఖానలో డయాలసిస్ సెంటర్, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద బస్తీ దవాఖానను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం కిడ్నీ రోగులకు వరంగా మారిందన్నారు. గతంలో దుబ్బాక నుంచి సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల లాంటి దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడ్డారన్నారు. నేడు దుబ్బాకలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు వల్ల కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందుతాయన్నారు. వంద పడకల దవాఖాన ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కోరిక మేరకు డయాలసిస్ సెంటర్ ప్రారంభించామన్నారు. పేషెంటకు ఉచితంగా సింగిల్ యూజ్ ఫిల్టర్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి గుర్తుచేశారు. దుబ్బాక వంద పడకల దవాఖానను సైతం బలోపేతం చేస్తామని, బ్లడ్స్టోరేజ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వంద పడకల దవాఖానలో అందుతున్న వైద్య సేవలు బాగున్నాయని మంత్రి కితాబునిచ్చారు. బస్తీ దవాఖానల్లో రోగులకు వైద్యులు పరీక్షలు చేసి ఉచితంగా మం దులు ఇవ్వడం, 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారన్నారు. 158 రకాల మందులు సైతం అందుబాటులో ఉంచి పేదలకు వైద్యం అందిస్తామన్నారు. పేదలు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి డబ్బులను వృథా చేసుకొవద్దని మంత్రి సూచించారు. మంచి అనుభవం గల డాక్టర్ పర్యవేక్షణలో బస్తీ దవాఖానలో వైద్య సేవలు అందిస్తామన్నారు. దుబ్బాకలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన డబుల్ బెడ్రూమ్లోని వందలాది కు టుంబాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.