సంగారెడ్డి, నవంబర్ 23 : తెలంగాణ ప్రజలు అభివృద్ధ్ది, సంక్షేమానికి కృషి చేసే ప్రభత్వాలను అదిరిస్తారని, మూడోసారి సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తంచేశారు. కంది మండల కేంద్రంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్, సంగారెడ్డి పట్టణంలోని కింగ్స్ ఫంక్షన్ హాల్లో గౌడ, మైనార్టీల ఆత్మీయ సమ్మేళనాలను గురువారం నిర్వహించారు. సమ్మేళనాలకు ముఖ్యఅతిథిగా మంత్రి హజరయ్యారు. సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళ నాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణలో గౌడ కులస్తుల సంక్షేమానికి కృషి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. అధికారం లోకిరానే హైదరాబాద్లో కల్లు దుకాణాలను తెరిపించి ప్రారంభించారని గుర్తు చేశారు. గ్రామాల్లో కల్లు దుకాణాలపై ఎైక్సైజ్ అధికారులు దాడి చేసి, కేసులు నమోదు చేసి మాముళ్ల దండుకునే వ్యవస్థకు స్వస్తి పలికారన్నారు. రాష్ట్రంలో నీరా కేఫ్లను ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే హైదరాబాద్లో రూ.25కోట్లతో నీరా కేఫ్లు తెరిపించామన్నారు. నీరాతో కిడ్నీలు సురక్షితంగా ఉంటాయని వైద్యలు చెప్పారని తెలిపారు. గీత కార్మికులు, కల్లు దుకాణాల లైసెన్స్లను పదేండ్లకు పొడిగించారన్నారు. ఆైన్లైన్లో రెన్యువల్ చేసుకునే విధానాన్ని అమలు చేశారనితెలిపారు. కల్లుగీత కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.6 లక్షల పరిహారం ఇస్తున్నట్లు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం షాదీఖానాల నిర్మాణాలకు ప్రభు త్వం నిధులు మంజూరు చేసిందని మంత్రి హరీశ్రావు తెలి పారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉన్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో హిందువులు, ముస్లింలు కలిసిమెలిసి శాంతియుతంగా జీవిస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గం లో ముస్లిం శ్మశానవాటికలకు సదాశిపేటలో 5 ఎకరాలు, సంగారెడ్డిలో 6 ఎకరాల స్థలాలు కేటాయిచినట్లు తెలిపారు. నాలుగు జమాతే ఇస్లాం కార్యాలయాలకు జిల్లాకేంద్రంలో స్థలాలు కేటాయించి, భవనాల నిర్మాణాలకు నిధులు మంజూ రు చేస్తామన్నారు. ముస్లింల సంక్షేమానికి కార్పొరేషన్ రుణా లు, విద్యార్థులకు విద్యారుణాలు, ఆడపిల్లల పెండ్లికి షాదీముబారక్ పథకంలో ఆర్థికసాయం చేశామని గుర్తుచేశారు. సంగా రెడ్డి జిల్లాకేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలలను ప్రారంభించామన్నారు. మైనార్టీ విద్యార్థులకు సంగా రెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశివపేట, కందిలో మైనార్టీ గురుకులాలకు పక్కా భవనాలను నిర్మిస్తామన్నారు. బీఆర్ఎస్ ముస్లింలకు అండగా ఉంటుందని, సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ను గెలిపించాలని కోరారు.
* బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్
పదవీ లేకున్నా ప్రజల మధ్యే ఉండడమే ప్రథమ కర్తవ్యమని, అందరికీ అందుబాటులో ఉంటానని ఎన్నికల్లో ఆదరించి గెలిపించాలని చింతా ప్రభాకర్ అభ్యర్థించారు. ఐదేండ్లు ప్రజలకు సేవకుడిగా పని చేస్తానని, ప్రతి సమస్యను సత్వరమే పరిష్కరిస్తానని తెలి పారు. ఆయా సమ్మేళనాల్లో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎన్నికల కోఆర్డినేటర్ పట్నం మాణిక్యమ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరహరిరెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు ముస్తాఫా, మామిళ్ల రా జేందర్, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, కల్లుగీత పారిశ్రామిక సంస్థ చైర్మన్ పల్లె రవిగౌడ్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్, నాయకులు ప్రతాప్ లింగంగౌడ్, ముఖీమ్, ఆశన్నగౌడ్ రమేప్గౌడ్, మనోహర్గౌడ్, భీరయ్యయాదవ్, మల్లాగౌడ్, ఎంఏ హకీం, మైనార్టీ పట్టణాధ్యక్షుడు షేక్ ఆంజాద్, షకీల్, సలావుద్దీన్, ఎంఐఎం కౌన్సిలర్ ఆరీఫ్, షేక్ సాబెర్, సోహైల్ అలీ, షమీ, హఫీజ్ సాబ్, కరీంసాబ్, వాజిద్, షేక్ రసీద్, ముఖీద్, హజీమ్, అమీరొద్దీన్, వాజీద్ పాల్గొన్నారు.