వందశాతం అభ్యర్థులు టెట్లో ఉత్తీర్ణత సాధించాలి
టెట్ తర్వాత డీఎస్సీ, గ్రూప్స్ ఉద్యోగాలకూ ఉచిత శిక్షణ
ఏ రంగంలో చూసినా పతాక శీర్షికలో సిద్దిపేట పేరు
నాడు వలసలు పోయినవాళ్లం.. నేడు మన దగ్గరికే వలసలు..
ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
కేసీఆర్ ఉచిత శిక్షణా శిబిరంలో ఉచిత మెటీరియల్ పంపిణీ
‘కాలం విలువైంది.. యువత సమయాన్ని వినియోగించుకోవాలి.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’.. అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆకాంక్షించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్న కేసీఆర్ ఉచిత శిక్షణా శిబిరంలో టెట్ మెటీరియల్ను మంత్రి ఆవిష్కరించారు. శిక్షణ పొందుతున్న సుమారు 731 మంది టెట్ అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పత్రికల్లో పతాక శీర్షిక నుంచి ఇంటర్మీడియట్ బోర్టు ప్రశ్నపత్రంలో ప్రస్థావన వరకు సిద్దిపేట ఎదిగిందని మంత్రి హరీశ్రావు అన్నారు. టెట్ శిక్షణ తర్వాత డీఎస్సీ, గ్రూప్స్ కోసం ఉచితంగా శిక్షణ ఇస్తామని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. తెలంగాణ రాకముందు సిద్దిపేట ఎలా ఉంది? తెలంగాణ వచ్చాక ఎలా ఉందో.. మీలాంటి చదువుకున్న వాళ్లు చెప్పాలన్నారు.
సిద్దిపేట అర్బన్, మే 14 : ‘కాలం చాలా విలువైనది.. గడిచిన కాలం తిరిగిరాదు కాబట్టి.. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో విజయం సాధించాలి’.. అని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ శివారులోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేసీఆర్ ఉచిత శిక్షణా శిబిరంలో టెట్ మెటీరియల్ను ఆవిష్కరించారు. శిక్షణ పొందుతున్న సుమారు 731మంది టెట్ అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ ఏ విధంగా ఉంది? సౌకర్యాలు ఎలా ఉన్నాయి? తదితర విషయాలపై అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లోని ప్రైవేటు ఇనిస్టిట్యూట్ల కంటే చాలా బాగుందని, ఇంత మంచి అవకాశం కల్పించిన రుణపడి ఉంటామని.. మీ కోరిక మేరకు మంచి ఫలితాలు సాధిస్తామని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉచిత శిక్షణను సమర్థవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు గోవర్ధన్రెడ్డి, శ్రీనివాస్ను మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు.
జీవితంలో దేన్నైనా మనసు పెట్టి చేసినప్పుడే సక్సెస్ అవుతామని చెప్పారు. ప్రదేశంతో పాటు మనలో ఆలోచనా విధానం మారినప్పుడే విజయం సాధిస్తామని ఉద్బోధించారు. సమయాన్ని వృథా చేయద్దని అభ్యర్థులకు సూచించారు. ప్రతి అభ్యర్థిలో ఉత్సా హం ఉందా.. లేదా అని తెలుసుకోవడానికే స్క్రీ నింగ్ టెస్ట్ నిర్వహించామని.. ఆ టెస్ట్లో 2500 మంది అభ్యర్థులు హాజరయ్యారని, వారిలో 700మంది అభ్యర్థులను శిక్షణకు పిలిచామన్నారు. ప్రతిరోజు సుమా రు 650 మందికి పైగా అభ్యర్థులు హాజరు కావ డం చాలా సంతోషంగా ఉందని, ఇలాగే పట్టుదలతో చదివి వంద శాతం టెట్లో ఉత్తీర్ణత సాధించాలన్నారు. గత టెట్ శిక్షణలో 80శాతం మంది ఉత్తీర్ణత సాధించారని, ఈ సారి కచ్చితంగా వంద శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి, సిద్దిపేట పేరు ప్రతిష్టను నిలబెట్టాలన్నారు. టెట్ శిక్షణ తరువాత డీఎస్సీ,గ్రూప్స్ కోసం ఉచితంగా శిక్షణ ఇస్తామని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. చివరి వారం రోజులు శిక్షణ ఇవ్వడంతో పాటు పరీక్షలంటే భయం పోగొట్టేందుకు టెస్ట్లు నిర్వహిస్తామని, ఇప్పుడు ఉచితంగా మెటీరియల్ కూడా అందిస్తున్నామని తెలిపారు. ఏ రంగంలో చూసినా సిద్దిపేట పేరు పత్రికల్లో పతాక శీర్షికలో ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షలో సిద్దిపేట స్వచ్ఛ బడి గురించి ప్రశ్నలు అడిగారని, బడి అం టే అది పెద్ద విద్యార్థులు చదువుకునే బడి కాద ని, పెద్దలు తెలుసుకునే బడి అన్నారు. ఎక్కడా లేని విధంగా గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని సిద్దిపేటలో గొర్లకు, పాడి పశువులకు హాస్టళ్లను నిర్మించామన్నారు. తెలంగాణ రాకముందు సిద్దిపేట ఎలా ఉంది? తెలంగాణ వచ్చాక సిద్దిపేట ఎలా ఉందో.. మీలాంటి చదువుకున్న వాళ్లు చెప్పాలన్నారు.
దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..
కొన్ని దశాబ్దాల కాలంలో జరగని పనులను కేవలం కొన్ని సంవత్సరాల్లో చేసి ఒక గుణాత్మక మార్పును తీసుకొచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24లక్షలు కాగా, నేడు రూ.2.78లక్షలు అయ్యిందన్నారు. దేశ తలసరి ఆదాయం కంటే దాదాపు రెట్టింపుగా రాష్ట్ర తలసరి ఆదాయం ఉందన్నారు. దేశంలోనే తలసరి ఆదాయం, 24 గంటల కరెంటు ఇవ్వడంలో, విద్యలో, వైద్యంలో ఇలా అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్గా నిలిచిందన్నారు. నాడు తెలంగాణ నుంచి ఇతర రాష్ర్టాలకు, దేశాలకు వలసలు పోయే వారని, కానీ నేడు తెలంగాణ రాష్ర్టానికే ఇతర రాష్ర్టాల వారు కూలీలుగా వస్తున్నారని చెప్పారు. దీనికి కారణం ఇక్కడ ఉత్పత్తిని పెంచడమే కాకుండా అద్భుతమైన సౌకర్యాలు పెంచడమే అన్నారు. కరోనా సమయంలో ఇతర రాష్ర్టాల కూలీలు రోడ్లపై నడుచుకుంటూ పోవడం చూశామని, వారు మన తెలంగాణ అభివృద్ధి భాగస్వాములే అని, సీఎం కేసీఆర్ వారికి ఉచితంగా రైల్ సౌకర్యం కల్పించి సొంత ప్రదేశాలకు పంపించారని గుర్తు చేశారు.
60ఏండ్లలో 3 అయితే.. ఏడేండ్లలో 33..
తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 60ఏండ్లలో కేవలం 3 మెడికల్ కాలేజీలు మాత్రమే వచ్చాయని, కానీ రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం ఏడేండ్లలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక సిద్దిపేటలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్, నర్సరీ, వెటర్నరీ, కేంద్రీయ విద్యాలయం ఇలా చాలా కళాశాలలు వచ్చాయన్నారు. తెలంగాణ రాకముందు ఒక ఎకరానికి రూ.2 లక్షలు నుంచి 5 లక్షలు ఉన్న భూమి నేడు రూ.20 నుంచి రూ.30 లక్షల విలువ ఉందన్నారు. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరా భూమి అమ్మి తెలంగాణలో 5 నుంచి 6 ఎకరాలు కొనుక్కునే వారని.. అలా వెలిసినవే ఈ గుంటూరు పల్లెలని చెప్పారు. కానీ నేడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రలో పది ఎకరాలు కొనుక్కునే పరిస్థితికి వెళ్లామన్నారు. ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి, సిద్దిపేట అర్బన్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎద్దు యాదగిరి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు భూసాని శ్రీనివాస్, మచ్చ వేణుగోపాల్రెడ్డి తన్నీరు శ్రీనివాస్ పాల్గొన్నారు.