తూప్రాన్, జనవరి 8: ఉమ్మడి తూప్రాన్ మండలంలో నేడు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పర్యటించనున్నారు. నిర్మాణాలు పూర్తయిన భవనాలను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆదివారం ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అధికారి (గడా) ముత్యంరెడ్డి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
మంత్రి పర్యటన ఇలా..
సోమవారం ఉదయం 10 గంటలకు మంత్రి హరీశ్రావు తూప్రాన్ చేరుకుని మున్సిపల్ పరిధిలోని అల్లాపూర్ శివారులో రూ.5.5 కోట్లతో నిర్మిస్తున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్, రూ.4.98 కోట్లతో నిర్మించనున్న గ్రెయిన్ మార్కెట్ను ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు తూప్రాన్ మున్సిపాలిటీలో రూ. 22 కోట్లతో నిర్మించనున్న సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలతో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు మండలంలోని ఆదర్శ గ్రామమైన మల్కాపూర్లో నిర్వహించే స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రూ.80 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం, రూ.28 లక్షలతో నిర్మించిన యూత్ అండ్ లైబ్రరీ భవనాన్ని, రూ.75 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీహాల్, రూ.32 లక్షలతో నిర్మించిన మహిళా భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం యావాపూర్ నుంచి మల్కాపూర్ వరకు రూ.20 కోట్లతో విస్తరించనున్న ఆర్అండ్బీ లింక్ రోడ్డును ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మనోహరాబాద్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు రివ్యూ మీటింగ్లో పాల్గొననున్నారు.