చిన్నకోడూరు, జనవరి 5: రైతుల సంక్షేమానికి మంత్రి హరీశ్రావు కృషి చేస్తున్నారని, రూ.కోటి 52 లక్షలతో నిర్మించిన మిర్చి మార్కెట్ను రైతుల సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్పర్పన్ వేలేటి రోజాశర్మ అన్నారు. గురువారం చిన్నకోడూరు మండలం గంగాపూర్ మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ వనితా రవీందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్పన్ మాట్లాడుతూ మండలంలోని గంగాపూర్, మాచాపూర్, చంద్లాపూర్, మెట్పల్లి, చిన్నకోడూరు తదితర ప్రాంతాల్లో రైతులు అధికంగా మిర్చిని సాగు చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని మంత్రి హరీశ్రావు దృష్టిలో పెట్టుకొని అన్ని హంగులతో మిర్చి మార్కెట్ను నిర్మించారన్నారు. రైతులకు అధిక సబ్సిడీతో కూడిన స్పింక్ల ర్లు, డ్రిప్ పరికరాలను అధిక మొత్తంలో మంజూరు చేసినట్లు తెలిపారు. మిర్చిని పండిస్తున్న రైతులు ప్రభుత్వం నిర్మించిన మిర్చి మార్కెట్లోకి తీసుకొచ్చి విక్రయించుకోవాలన్నారు. మిర్చిని దళారులకు విక్రయిస్తే వారు మోసం చేస్తారన్నారు. మార్కెట్ యార్డులో రైతులుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్కెట్ కమిటీ చర్యలు చేపట్టాలని సూచించారు.
మండల స్థాయి టీఎల్ఎం మేళా
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులు బాటలు వేయాలని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. చిన్నకోడూరులో మండల స్థాయి టీఎల్ఎం మేళాను జడ్పీహెచ్ఎస్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన స్టాళ్లను ఎంపీపీ కూర మాణిక్యరెడ్డితో కలిసి ఆమె సందర్శించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ విద్యా రంగాన్ని గతంతో పోల్చుకుంటే మంత్రి హరీశ్రావు కృషితో అనేక మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయన్నారు. దీంతో గతేడాది పది ఫలితాల్లో రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. చిన్నకోడూరు మండలాన్ని జిల్లాలో మొదటి వరుసలో ఉండేలా కృషి చేస్తామన్నారు. టీఎల్ఎం మేళాలో విద్యార్థులు తయారు చేసిన వివిధ ఆకృతులు ఆకట్టుకున్నాయన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వనితా రవీందర్రెడ్డి, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, వైస్ చైర్మన్ కుంటయ్య, సర్పంచులు లింగారెడ్డి, ఉమేశ్చంద్ర, బీఆర్ఎస్ మండల అధక్షుడు శ్రీనివాస్, సర్పంచు ఉమేశ్ చంద్ర, ఎంపీటీసీ శ్రీనివాస్, ఎంఈవో దేశిరెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షుడు వేణు, ఎంపీటీసీ దుర్గారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు రమేశ్, మల్లేశం, వెంకట్ రెడ్డి, లింగం ఉన్నారు.