చేగుంట, జూలై 18: ఎల్నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులాంతా ఆరుతడి పంటలు సాగుచేయాలని మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ రైతులకు సూచించిగా, తాము కోతల బెడదతో చాలారకాల పంటలు సాగుచేయలేక పోతున్నామని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. శనివారం మెదక్ జిల్లా చేగుంట రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్నినో అవగాహన సదస్సుకు మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కరుస్తాయని నిపుణుల సూచనల నేపథ్యంలో, రైతులు తక్కునీటి వనరులతో పండే పంటలు పండించేలా అవగాహన సదస్సుల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఆరుతడి పంటల సాగు కు కోతుల బెడద ఎక్కువగా ఉంద ని, కోతుల బెడద అరికట్టేందుకు ప్రభు త్వం చొరవ తీసుకోవాలని పలువురు రైతు లు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
వరి వద్దని, ప్రత్యామ్నాయ పంటలే ముద్దు అనే నినాదంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. రైతులందరూ వ్యవసాయ శాఖ సలహాలు, సూచనలు పాటిస్తూ పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. తూ ప్రాన్ ఆర్డీవో బావయ్య, మండల ప్రత్యేకాధికారి హేమభార్గవి, మెదక్ జిల్లా వ్యవసాయాధికారి వినయ్కుమార్, చెరుకు శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్వెంగళ్రావు, సొసైటీ చైర్మన్ మ్యాకల పరమేశ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు సండ్రుగు స్రవంతిసతీశ్,ఎంపీడీవో చిన్నారెడ్డి, తహసీల్దార్ బాల్లక్ష్మి, ఏవో హరిప్రసాద్ పాల్గొన్నారు.