అందోల్, మార్చి 3: పోలియో రహిత సమాజం కో సం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్యారోగ్య, సై న్స్, టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం జోగిపేట ప్రభుత్వ దవాఖానలో పల్స్పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి, పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐదేండ్ల లోపు చిన్నారులకు పోలియోచుక్కలు వేయించాలన్నారు.
ఆరోగ్య సిబ్బంది రెండు రోజులు అన్ని గ్రామాల్లో పోలియో చుక్కలు వేస్తారని, వారి సేవలు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం దవాఖానలో కొత్త అంబులెన్స్ను ప్రారంభించారు. ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యసిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్వో గాయత్రీదేవి, సూపరింటెండెంట్ రమేశ్, ఆర్డీవో పాండు, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.