చౌటకూర్, జనవరి 24: విద్యార్థుల్లో రక్తహీనత నివారణే లక్ష్యంగా పనిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట జిల్లా పరిషతు ఉన్నత పాఠశాలలో బుధవారం ‘అనీమియా ముక్త్’ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ ఏ విద్యార్థి కూడా రక్తహీనతతో బాధపడకూడదన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వాప్తంగా నెల రోజులు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. రోజూ వంద నుంచి 300 మంది విద్యార్థులకు పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు.
ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణణ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ‘అనీమియా విముక్త్’ నిర్వహిస్తున్నామన్నారు.జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ జిల్లాలో రక్తహీనత సమస్య లేకుండా నివారిద్దామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి గాయత్రీదేవి, అందోలు-జోగిపేట ఆర్డీవో పాండు, ఎంపీడీవో జయలక్ష్మి, తహసీల్దార్ ఈశ్వరీరాణి, సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ కిరణ్గౌడ్, చౌటకూర్, పుల్కల్ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు నత్తి దశరత్, దుర్గారెడ్డి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, ప్రభుశేఖర్రెడ్డి, వెండికోలు రాములు, ఈశ్వర్గౌడ్, పార్కల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.