నిజాంపేట, సెప్టెంబర్1౩: రైతుల ప్రగతికే ప్రభుత్వం రైతు వేదిక భవనాలను ఏర్పాటు చేసిందని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్ అన్నారు. సోమవారం ఆయన మండల ఏవో సతీశ్తో కలిసి మండలంలోని కల్వకుంటలో రైతులు సాగు చేస్తున్న వరి ,పత్తి, కంది, మొక్కజొన్న పంటలు, రైతు వేదిక భవనాన్ని సందర్శించి మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో బ్యాక్టీరియా, ఆకుఎండు తెగులు ఉంటుందని, వీటి నివారణకు వ్యవసాయ అధికారులు సూచించిన మందులను పంటలకు పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో గణేశ్కుమార్, రైతులు మాధవరెడ్డి, గోపాల్రెడ్డి, పీఏసీఎస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.