సిద్దిపేట అర్బన్, మే 18: పల్లె, పట్టణ ప్రగతి, ధాన్యం సేకరణ, తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై సీఎం కేసీఆర్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి సిద్దిపేట, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్లు రోజాశర్మ, మంజుశ్రీ, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, సిద్దిపేట స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, మెదక్ కలెక్టర్ హరీశ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తదితర అధికారులు హాజరయ్యారు.