చేగుంట, అక్టోబర్ 8: సొసైటీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్లో ఎంపీ నిధులతో నిర్మించిన సొసైటీ మొదటి అంతస్తు భవనాన్ని సొసైటీ చైర్మన్ వంటరి కొండల్రెడ్డి, కార్యవర్గం సభ్యులు, స్థానిక సర్పంచ్ దొరగొల్ల రాములు, ఎంపీటీసీ బెదరబోయిన భాగ్యమ్మతో కలిసి ప్రారంభించారు. మక్కరాజిపేటలో విద్యుత్ సబ్స్టేషన్కు భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలోని దివ్యాంగులకు స్కూటీలు అందజేశారు. మండలంలోని బీ కొండపూర్లో నిర్వహించిన యువ గర్జన సందర్భంగా చేగుంట నుంచి బీ కొండపూర్ సింగరాయుడిగుట్ట లక్ష్మీ నర్సింహ స్వామి దేవాలయం వరకు (14 కిలోమీటర్లు) నిర్వహించిన బైక్ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. 60 ఏండ్లలో ప్రజలు పడ్డ గోసను అధికారంలోకి వచ్చిన 9 ఏండ్లలో సీఎం కేసీఆర్ తీర్చారన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకోసం రైతు బంధు, రైతుబీమా, సబ్సిడీ ఎరువులు, విత్తనాలతోపాటు పంటకు మద్దతు ధర కల్పిస్తున్నారన్నారు. సహకార సంఘాలు, ఐకేపీలతో ప్రభుత్వమే కొంటున్నదన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని రానున్న ఎన్నికలలో ప్రజలోకి తీసుకెళ్లి,గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనక్ ప్రవీణ్కుమార్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, సర్పంచ్లు బాల్నర్సు, కుమ్మరి శ్రీనివాస్, దొరగొల్ల రాములు, ఎంపీటీసీలు బండి కవిత విశ్వేశ్వర్, నవీన్, బెదరబోయిన భాగ్యమ్మ, ఉప సర్పంచ్ తోట రమేశ్, దుబ్బాక యూత్ అధ్యక్షుడు సురేశ్గౌడ్, యూత్ సభ్యులు సాబేర్, మహ్మద్ ఆలీ, డిష్ రాజు, క్రాంతి, చేగుంట డీసీసీబీ మేనేజర్ శశికాంత్రెడ్డి, డైరెక్టర్లు రాంరెడ్డి, రఘువీర్రావు, గణేశ్, సీఈవోలు శ్రీనివాస్, సంతోష్కుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.