రామాయంపేట, డిసెంబర్ 4 : మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్త, రాయిలాపూర్ మాజీ సర్పంచ్ సీతగారి ఎల్లారెడ్డి మాతృమూర్తి సీతగారి మణెమ్మ (80)అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకు న్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వెంకటాపూర్ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మణెమ్మ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, సర్పంచ్ బండారి మహేందర్రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ బండారి మల్లారెడ్డి, నాయకులు నిజాంపేట కిష్టారెడ్డి, శ్రీధర్రెడ్డి, రాంరెడ్డి, దుర్గారెడ్డి, అభిలాష్రెడ్డి, భూపాల్రెడ్డి ఉన్నారు.
మండలంలోని జగరాల గ్రామంలో సాంబశివుడు రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెం దాడు. టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబీకులను అందోల్ ఎమ్మెల్యే చంటిక్రాంతికిరణ్ పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట పీఏసీ ఎస్ చైర్మన్ రాజూయాదవ్, ఎంపీటీసీ నర్సింహులు, నేతలు రమేశ్, హమీద్, హనుమాండ్లు, సత్యాగౌడ్ ఉన్నారు.