చిన్నశంకరంపేట, డిసెంబర్ 28 : ఆధ్యాత్మికతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట గ్రామ శివారులోని అయ్యప్ప ఆలయం వద్ద అయ్యప్ప స్వామి మహాపడిపూజ నిర్వహించారు. సాయం త్రం సోమేశ్వరస్వామి ఆలయం నుంచి అయ్యప్ప స్వామి ఆలయం వరకు అయ్యప్ప స్వామి ఉత్తర విగ్రహాన్ని అశ్వవాహనంపై ఊరేగింపు సేవ నిర్వహించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఎమ్మెల్సీ శేరిసుభాశ్రెడ్డి పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అయ్యప్పస్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్వాములు గంగా నరేందర్, జనార్దన్రెడ్డి, రంగారావు, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, చేగుంట, రామాయంపేట, మెదక్ మండలాల నుంచి అయ్యప్పస్వాములు భారీగా తరలివచ్చి పడిపూజలో పాల్గొన్నారు.