టేక్మాల్/చేగుంట/పాపన్నపేట /పెద్దశంకరంపేట/రామాయంపేట/నిజాంపేట/మెదక్ మున్సిపాలిటీ/మెదక్ అర్బన్/హవేళీఘనపూర్, జనవరి 3 : విద్యా రంగానికి పెద్దపీట వేసిన సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడుచుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. హవేళీఘనపూర్ ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫూలే జయంతి ఉత్సవాలకు హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు.
అనంతరం అంగన్వాడీ టీచర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా రంగానికి పెద్దపీట వేసిన సావిత్రబాయి ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారాం, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, సర్పంచ్ సవిత, బీసీ సంక్షేమ సంఘం నాయకులు మల్లేశం, భీమరి శ్రీను, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గణపతి, అధ్యాపకులు నారాయణ, వెంకటేశ్వర్లు, సుధాకర్, రమేశ్ పాల్గొన్నారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు హరిసింగ్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. చేగుంట జిల్లా పరిషత్ పాఠశాల,చిన్నశివునూర్,చెట్లతిమ్మాయిపల్లి పాఠశాలలో ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె సేవలను కొనియాడారు. టేక్మాల్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో టేక్మాల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నాయికోటి సుప్రజా భాస్కర్ ఆధ్వర్యంలో నివాళులల్పించారు.
నిజాంపేటలో..
నిజాంపేటలో ఫూలే జయంతిని ప్రజాప్రతినిధులు,దళిత సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని కొనియాడారు. కార్యక్రమంలో ఏఎస్సై లక్ష్మి, వార్డు సభ్యులు మావురం రాజు,ఆముద రాజు, చల్మెడ ఎంపీటీసీ బాల్రెడ్డి,రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్ రవి, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, సుధాకర్, సిద్ధిరాంరెడ్డి ఉన్నారు.
రామాయంపేట పట్టణంలోని పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సావిత్రి బాయి పూలే సంఘం అధ్యక్షురాలు పోచమ్మల అశ్వి నీ, ఎమ్మార్పీఎస్ నాయకులు పాతూరి రాజు మాదిగ, మల్యాల కిషన్, ఎనిశెట్టి అశోక్, సురేశ్ నాయక్, మల్లేశం, చాకలి వెంకటి, వెలుముల రమేశ్, జలగడుగుల శ్రీనువాస్, చింతల శేఖర్, పుట్టి శ్రీనువాస్, రమేశ్, వినయ్, యాదగిరి, రామచంద్రం, శ్రీనివాస్, సంజీవులు, నరేశ్ పాల్గొన్నారు.