Padma Devender Reddy | నిజాంపేట, ఫిబ్రవరి11 : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా 10 ఏండ్ల పాటు సుభిక్షమైన పాలనను అందించిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. చల్మెడలో గౌడ సంఘం సభ్యులు శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాలు జరిగాయి. మంగళవారం రేణుక ఎల్లమ్మ కల్యాణ మహోత్సవంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. పద్మా దేవేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని, మాజీ సీఎం కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. మళ్లీ సీఎం కేసీఆర్ ఐనప్పుడే రాష్ట్రానికి పూర్వవైభవం సాధ్యమవుతుందన్నారు. ఆలయానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని గౌడ సంఘం సభ్యులు శాలువకప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, రామాయంపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విజయలక్షీ, మాజీ ఎంపీపీ సంపత్, మాజీ ఎంపీటీసీలు బాల్రెడ్డి, నాళం కిష్టాగౌడ్, నాయకులు అబ్దుల్ అజీజ్, గౌస్, నరేందర్, రంజిత్ గౌడ్, వెంకట స్వామి గౌడ్, గౌడ సంఘం సభ్యులు ఎల్లాగౌడ్, లక్ష్మీనారాగౌడ్, తిర్మల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.