మెదక్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్ వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మెదక్ డీఎల్పీవో రాజేంద్రప్రసాద్ ఇన్చార్జి డీపీవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. డిసెంబర్ 31, 2020న మెదక్ డీపీవోగా బాధ్యతలు తీసుకున్నారు. కరోనా సమయంలో జిల్లాలోని గ్రామాల్లో శానిటేషన్తో పాటు గ్రామస్తులకు కరోనాపై అవగాహన కల్పించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశాలతో జిల్లాలోని పారిశుద్ధ్య కార్మికులకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ బీమాను చేయించారు.
జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి లైబ్రరీ డిపార్ట్మెంట్కు సెస్ ద్వారా రూ.కోటి చెల్లించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం రెండు విడతలు జిల్లాలో విజయవంతమయ్యేలా కృషి చేశారు. ఆస్తి పన్ను వసూళ్లలో వందశాతం టార్గెట్ను పూర్తి చేసి, పన్ను వసూళ్లు ఆన్లైన్ పేమెంట్లోనే జరిగాయి. మెదక్ జిల్లాలో 24 నెలల పాటు డీపీవోగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచామన్నారు. జిల్లాలో డీపీవో తరుణ్కుమార్ తనదైన ముద్ర వేసుకున్నారు.