మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 10 : టీఎస్ బీపాస్ నుంచి పొందిన అనుమతుల ప్రకారమే భవనాలు నిర్మించాలని, నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపడితే తొలిగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ టీఎస్ బీపాస్ ద్వారా ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిశీలించి అనుమతులు ఇవ్వడంలో జాగ్రత్త వహించాలని, లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు పొందిన మేరకే నిర్మాణాలు చేపడుతున్నరా లేదా పరిశీలించి అతిక్రమించిన వాటికి నోటీసులు ఇచ్చి తొలిగించాలని సూచించారు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నిబంధనల ప్రకారమే నిర్మాణాలు కొనసాగుతున్నాయా అనే విషయాన్ని పరిశీలించాలన్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి టాస్క్ ఫోర్స్ సహకారంతో నిర్మాణాలను తొలిగించాలన్నారు. మన్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ డీటీసీపీ లేఅవుట్లకు అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉంటేనే ఆమోదం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ శ్యాం సుందర్, మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ ము న్సిపల్ కమిషనర్లు శ్రీహరి, శ్రీనివాసన్, మోహన్, చా ముండేశ్వరీ, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
పల్లెలను పచ్చదనంతో ఆదర్శంగా తీర్చిదిద్దాలి
ప్రతి పల్లెను పచ్చదనంతో పరిశుభ్రంగా, ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ అన్నారు. మండల పరిధిలోని బి.తిమ్మయిపల్లి గ్రామపంచాయతీలో అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం డంపింగ్యార్డును పరిశీలించారు. నిత్యం పంచాయతీ సిబ్బంది తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించి పరిశుభ్రత గ్రా మంగా తీర్చదిద్దాలన్నారు.