మెదక్, ఫిబ్రవరి 10 : డబుల్ బెడ్రూం ఇండ్లు, వైకుంఠధామాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, పాఠశాలల అదనపు తరగతి గదులు, సీసీ రోడ్లు వంటి ప్రగతిలో ఉన్న నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా జిల్లాలో చేపట్టిన వివిధ పనుల ప్రగతిని సమీక్షిస్తూ చేసిన పనుల నాణ్యతను పరిశీలించి వెంటనే ఎంబీ రికా ర్డు చేసి డబ్బులు చెల్లించాలని సూచించారు. మె దక్లోని స్టేడియంలో జరుగుతున్న నిర్మాణ పనుల వివరాలు తెలుసుకుం టూ ఫ్లోరింగ్, రైలింగ్, పెయింటింగ్ పనులు పూర్తి కాగా, మిగిలిన ఎలక్ట్రికల్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 18న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పలు భవనాలను ప్రారంభించేందుకు వీలుగా తూప్రాన్లో నిర్మిస్తున్న ము న్సిపల్ భవనం, ఆర్ అండ్బీ అతిథి గృహం, గ్రైన్ మార్కెట్, వైకుంఠధామం, మనోహరాబాద్ గ్రామ పం చాయతీ భవనం తుది దశ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 31 ఆరోగ్య ఉప కేంద్రాలు మంజూరు కాగా, అన్ని పనులను వెంటనే ప్రారంభించి వేగవంతం చేయాలని అన్నారు. పిల్లికోటాల్, రామాయంపేట ముగింపు దశలో ఉన్న రెండు పడకల ఇళ్ల నిర్మాణాలకు కావాల్సిన నిధులు అందజేయాల్సిందిగా పంచాయతీరాజ్ ఎస్ఈ కలెక్టర్ను కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, పంచాయతీరాజ్ ఎస్ఈ కనకరత్నం, డిప్యూటీ ఈఈ పాండురంగారెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు పాల్గొన్నారు.
గంజాయి నిర్మూలన పోస్టర్ ఆవిష్కరణ
గంజాయి నిర్మూలన పోస్టర్ ఆవిష్కరణను గురువారం మెదక్ కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ ఎస్.హరీశ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గంజాయి రహిత జిల్లాగా మార్చాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎక్సైజ్ శాఖ డీసీ శాస్త్రి, ఈఎస్ రజాక్, మెదక్ డీఎస్పీ సైదులు, ఎక్సైజ్ సీఐ నాగేశ్వర్రావు పాల్గొన్నారు.