మెదక్రూరల్, ఫిబ్రవరి 6: గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా గొర్రెలను పంపిణీ చేయడమేకాకుండా వాటి ఆర్యోగంపైనా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నది. ప్రస్తుతం గొర్రెలు,మేకలకు వ్యాపిస్తున్న ముసర వ్యాధినుంచి కాపాడేందుకు ఉచితంగా పీపీఆర్ వ్యాక్సిన్లు వేయిస్తున్నది. పీపీఆర్ అనే వ్యాధి కారణంగా మూగజీవాలు మృత్యువాత పడడమే గాక పెంపకదారులు ఏటా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలోప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వ్యాక్సిన్లు వేస్తున్నారు. మెదక్ మండలంలో గొర్రెలు 16, 632, మేకలు 5216 మొత్తం సుమారు 21848 గొర్రెలు ,మేకలున్నాయి. వీటికి పశువైద్య కేంద్రాల సిబ్బం ది గోపాలమిత్ర సిబ్బంది పీపీఆర్ టీకాలు వేస్తున్నారు. సాధారణంగా ఒకదాని నుంచి మరొక దానికి వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి లక్షణాలు 4నుంచి 10 రోజుల్లో బ యటపడుతాయి. వ్యాధి తీవ్రత మేకల్లో కంటే గొర్రెల్లో ఎ క్కువగా ఉంటుంది.
వ్యాధి లక్షణాలు
నివారణ ఇలా
పీపీఆర్ వ్యాక్సిన్ ఇస్తున్నాం
పీపీఆర్ వ్యాధి నివారించేందుకు ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నది.పెంపకందారులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.ప్రస్తుతం ఎక్కువగా నీలి నాలుక రోగం వస్తుంది. ఈ వ్యాధిసోకిన గొర్రెలను వెంటనే గుర్తించి వైద్యులను సంప్రదించాలి. జీవాలకు వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.
-భాను చందర్, వెటర్నరీ అసిస్టెంట్, మాచవరం
పాడిరైతుల ఆర్థికాభివృద్ధికి కృషి
గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా గొర్రెలను పంపిణీ చేయడమేకాకుండా వాటి ఆర్యోగంపైనా ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. మూగజీవాలకు పల్లెల్లో షెడ్లు నిర్మించడానికి ప్రభుత్వం నిధులు అందజేస్తుంది.
-వికాస్, బాలానగర్ సర్పంచ్