మెదక్/ సంగారెడ్డి నెట్వర్క్, ఆగస్టు 19;మొక్కులు తీర్చుకున్న భక్తులు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకొన్నారు. చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణల్లో ఆకట్టుకున్నారు. చిన్నారి శ్రీకృష్ణులు చిట్టిచిట్టి పాదాలతో పరుగులు పెడుతూ ఉట్టి కొట్టే కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. రాధాగోపాలురు కలిసి కోలాటం ఆడుతూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు నిర్వాహకులు శ్రీకృష్ణుడికి పలు ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన గోకులాష్టమి ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీచర్లు పాల్గొన్నారు.
–