మెదక్/ సంగారెడ్డి నెట్వర్క్, ఆగస్టు 19;వజ్రోత్సవాల్లో పన్నెండో రోజు సేవా స్ఫూర్తి వెల్లువెత్తింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి పండ్లు , బ్రెడ్లు పంపిణీ చేశారు. కలెక్టరేట్లో మహిళా అధికారులు, సిబ్బందికి ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జైలును జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎస్పీ రమణ కుమార్, కలెక్టర్ శరత్ సందర్శించి ఖైదీలకు పండ్లు, మిఠాయిలు అందజేశారు. బైపాస్ రోడ్డులోని రెండు వృద్ధాశ్రమాల్లో వృద్ధులు, చిన్నారులకు మిఠాయిలు, పండ్లు ఇచ్చారు. హత్నూర మండలం దౌల్తాబాద్లో ముస్లింలు ర్యాలీ తీయగా, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఝరాసంగం పీహెచ్సీలో జడ్పీ సీఈవో సీహెచ్ ఎల్లయ్య, డీఆర్డీఏ శ్రీనివాస్రావు, రోగులు, గర్భిణులకు పండ్లు పంచిపెట్టి, అన్నదానం చేశారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం మెదక్, సంగారెడ్డి జిల్లాలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో రోగులకు, అనాథశ్రమాల్లో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, అం దోల్లో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జహీరాబాద్లో ఎమ్మెల్యే మాణిక్రావు, నారాయణఖేడ్లో ఎమ్మె ల్యే భూపాల్రెడ్డి, మెదక్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి పాల్గొన్నారు.