నర్సాపూర్/చిలిపిచెడ్, ఆగస్టు 17 : ప్రతి ఒక్కరూ ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్త దానం చేసి, ప్రాణదాతలుగా నిల వాలని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పిలుపునిచ్చారు. 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవా రం నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా దవాఖానలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ.. టీ ఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంచి పేదప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తుందన్నారు. ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించి డబ్బులు వృథా చేసుకోకుండా ప్రభుత్వ దవాఖానల్లోని వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ దవాఖానలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 62 మంది పాల్గొని రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని సేకరించి మెదక్ దవాఖానలోని బ్లడ్ బ్యాంక్కు తరలించినట్లు దవాఖాన సూపరిండెంటెండ్ మీర్జా నజీమ్బేగ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, ఏఎంసీ చైర్మన్ అనసూయ, మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి, ఎంపీడీవో మార్టిన్ లూథర్, టీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, దవాఖాన సూపర్వైజర్ వంశీ, టీఆర్ఎస్ నాయకులు అశోక్గౌడ్, నగేశ్, ఆంజనేయులు, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒక్కసారి రక్తదానం చేయవచ్చని కౌడిపల్లి ప్రభుత్వ దవాఖాన అధికారి డాక్టర్ వెంకట్ యాదవ్ అన్నారు. కౌడిపల్లి ప్రభుత్వ దవాఖానలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నర్సాపూర్ సీఐ షేక్ లాల్ మధార్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.