మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ రూరల్/ హవేళీఘనపూర్/ నిజాంపేట/ రామాయంపేట/ రామాయంపేట రూరల్/ చిన్నశంకరంపేట/ పాపన్నపేట, ఆగస్ట్టు 17 : సీఎం కేసీఆర్ రాజకీ య కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని బుధవారం టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ నాయకులు మెదక్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించా రు. జిల్లా కేంద్ర దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశా రు. అనంతరం చర్చి కాంపౌండ్ సంధ్యా నిలయంలోని వృద్ధులతో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆజయ్, సుధాకర్, ప్రశాంత్, పండరీగౌడ్, భాస్కర్ పాల్గొన్నారు.
మెదక్ మండలంలోని మగ్ధూంపూర్లో సర్పంచ్ కళావతి, తిమ్మానగర్లో మాజీ ఉప సర్పంచ్ సిద్ధిరాములు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహంచి, బహుమతులు అందజేశారు.
హవేళీఘనపూర్ చౌరస్తాలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి స్వగ్రామం కూచన్పల్లిలో సర్పంచ్ దేవాగౌడ్ ఆధ్వర్యంలో రేణుకామాత దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మండల కో- ఆప్షన్ సభ్యుడు ఖాలేద్, సర్పంచ్లు మహిపాల్, యామిరెడ్డి, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, రమేశ్, ఉప సర్పంచ్ బయ్యన్న, నాయకులు ప్రశాంత్, మోహన్గౌడ్, గణపతి పాల్గొన్నారు.
నిజాంపేట మండలం నస్కల్లోని పెద్దమ్మ ఆలయంలో జడ్పీటీసీ పంజా విజయ్కుమార్ జమ్మి మొక్కను నాటారు. దుర్గాభవానీ మాత యూత్ సభ్యులతో కలిసి కేక్కట్ చేశారు. నస్కల్లో ఇటీవల మృతి చెందిన రమేశ్ కుటుంబాన్ని జడ్పీటీసీ పరామర్శించి నిత్యవసర సరుకులతోపాటు రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రాంపూర్ గ్రామానికి చెందిన దుబ్బరాజగౌడ్, యాదగిరిని పరామర్శించారు. ఆయన వెంట నేతలు పుట్టి అక్షయ్, దేశెట్టి లింగం, వెంకటేశ్, దుర్గాభవానీ యూత్ సభ్యులు ఉన్నారు.
రామాయంపేట మున్సిపల్లోని కోమటిపల్లితండాతో పా టు కాట్రియాల, గొల్పర్తి గ్రామాల్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అభిమానులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కోమటిపల్లిలోగిరిజన పెద్దలు భోగ్భండార్ నిర్వహించి సేవాలాల్కు మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో నేతలు రవితేజ, నర్సారెడ్డి, శ్రీనివాస్, రామకిష్టయ్య, జ్యోతి, బాబు ఉన్నారు.
రామాయంపేట మండలంలోని అక్కన్నపేట, ఝాన్సీలింగాపూర్తోపాటు పలు గ్రామాల్లో సుభాష్రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఝాన్సీలింగాపూర్లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు పంబాల జ్యోతి, జంగం నర్సవ్వ, నాయకులు పోచయ్య, జంగం సిద్ధ్దిరాములు, వగ్గు గంగాధర్, కమ్మరి ప్రభాకర్ పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట మండలంలో గిరిజనులు బోగ్ బండార్ నిర్వహించారు. గవ్వలపల్లిలో వైద్యశిబిరం నిర్వహించారు. చిన్నశంకరంపేటలో సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ గంగానరేందర్తోపాటు సర్పంచ్లు మొక్కలు నాటారు.
ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఎమ్మెల్సీ సుభాశ్రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పాపన్నపేట పీహెచ్సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఏడుపాయల మాజీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ చైర్మన్ త్యార్ల రమేశ్, సర్పంచ్ లు శ్రీనాథ్, విఠల్, దానయ్య, హీరాలాల్, ఎల్లప్ప, ఎంపీటీసీ లు గణేశ్, సాయిలు, రాజు, డైరెక్టర్లు మహిపాల్, మాజీ ఎంపీటీసీలు బాలయ్య, కోఆప్షన్ సభ్యులు గౌస్, బాలయ్య, ఉపసర్పంచ్లు అజయ్, దుర్గాదాస్, నాయకులు సిద్ధ్దిరాములు, జనార్దన్, భరత్, భిక్షపతి, గడ్డయ్య, శంకరయ్య, చెన్నాగౌడ్ పాల్గొన్నారు.