శివ్వంపేట, ఆగస్టు 16 : స్వతంత్ర భారత వజ్రోత్సవా ల సందర్భంగా జిల్లావ్యాప్తంగా మంగళవారం క్రీడాపోటీలు నిర్వహించారు. శివ్వంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించారు. కబడ్డీ పోటీలో ప్రెస్క్లబ్, లీడర్స్ జట్లు తలపడ్డాయి. ప్రెస్క్లబ్ జట్టు అధ్యక్షులు బొడ్డు రవి, లీడర్స్ జట్టుకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్ సారథ్యం వహించారు. హోరాహోరీగా సాగిన పోటీలో లీడర్స్ జట్టు గెలిచింది. టగ్ ఆఫ్ వార్ పోటీలో ఇవే జట్లు తలపడగా రమణగౌడ్ సారథ్యంలోని లీడర్స్జట్టు విజయం సాధించింది. ఎంపీపీ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఎంపీడీవో నవీన్కుమార్, ఎస్సై రవికాంత్రావు, మండల ప్రత్యేకాధికారి నర్సయ్య న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. కబడ్డీ పోటీల్లో స్పెషల్ ఆఫీసర్స్, ఎంపీడీవో జట్లు తలపడగా ఎంపీడీవో టీం గెలిచింది. వాలీబాల్ పోటీల్లో పీఈటీ టీమ్ విజయం సాధించింది. విజేతలకు ఎంపీపీ, తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్సై బహుమతులు అందజేశారు.
యువత ఆటలు ఆడాలి : ఎంపీడీవో శశిప్రభ
యువతీయువకులు ప్రతిరోజూ ఆటలు ఆడాలని ఎంపీడీవో శశిప్రభ అన్నారు. గంగారం గ్రామంలోని క్రీడా మైదానంలో విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీవో కృష్ణమోహన్, స ర్పంచ్లు మమత, గోపాల్రెడ్డి, ఉపసర్పంచ్ సుధీర్రెడ్డి, కౌ డిపల్లి ఆత్మకమిటీ డైరెక్టర్ విజయమ్మ, టీఆర్ఎస్వై మాజీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, కార్యదర్శులు పాల్గొన్నారు.
చేగుంట, నార్సింగి మండలాల్లో ఆటల పోటీలు
చేగుంట, నార్సింగి మండలాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. చేగుంట ఆదర్శ పాఠశాలలో ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, తహసీల్దార్ లక్ష్మణ్బాబు, ఎంపీడీవో ఆనంద్మేరీ, నార్సింగిలో ఎంపీపీ సబిత పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్సై ప్రకాశ్గౌడ్, ప్రిన్సి పాల్ భూపాల్రెడ్డితోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులకు బహుమతులు అందజేత
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తూప్రాన్ బాలుర ఉన్నత పాఠశాల లో క్రీడాపోటీలు నిర్వహించారు. క్రీడాకారులకు మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, కోరమాండల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ జీవీ సుబ్బారెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సం దర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ తాను చదువుకున్న తూ ప్రాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన ఆధ్వర్యంలో క్రీడలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం వెంకటలక్ష్మి, ఆర్టీసీ రిటైర్డ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ నాగేందర్రావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.