సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 16 : జనగమ మన అదినాయక జయహే.. అంటూ మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపన ముక్త కంఠంతో నిర్వహించారు. అన్నివర్గాల ప్రజలు ఈ సామూహిక జాతీయ గీతాలాపనలో భాగస్వాములయ్యారు. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో నిర్వహించిన సామూహిక గీతాలాపనలో జడ్పీ చైర్పర్సన్ మం జుశ్రీ, కలెక్టర్ డాక్టర్ శరత్, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల జిల్లా అధికారులు, కళాశాల స్థాయి విద్యార్థులు, యువత, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ జాతీయ సమైక్యత, దేశాభిమానం పెంపొందించే విధంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఆయా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆమె కోరారు. కలెక్టర్ శరత్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని స్పష్టం చేశారు. దేశంలో అన్ని జాతులు, కులాలు, మతాలు ఉన్నాయని, అందరూ సర్వమత సమానంతో మెలిగే విధంగా ఐక్యత చాటాలని కోరారు.
నేటి యువత మహనీయులను ఆదర్శంగా తీసుకొని దేశభక్తి పెంపొందించుకొని ముందుకు సాగాలని సూచించారు. ప్రజల్లో జాతీయ భావం పెంపొందించేందుకు ఈ వజ్రోత్సవ వేడుకలు ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్ వివరించారు. అంతకుముందు స్థానిక తారా ప్రభుత్వ కళాశాల విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్లో..
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మెదక్ కలెక్టరేట్లో మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జెమ్లానాయక్, జిల్లా ట్రెజరీ అధికారి చిన్నసాయిలు, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి విజయశేఖర్రెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్, జిల్లా మత్య్స శాఖ అధికారి రజని, ఏవో బలరాం, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
టీఎన్జీవోల ఆధ్వర్యంలో..
అమరుల స్ఫూర్తితో యువత తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలను సాధించాలని అదనపు కలెక్టర్ రమేశ్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ యేస య్య, జిల్లా కార్యదర్శి రాజ్కుమార్, జిల్లా మాజీ అధ్యక్షుడు మేడిశెట్టి శ్యాంరావు, ఐడీసీ ఈఈ కీమానాయక్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు అనురాధ, మంగ మనోహర్, ఎండీ ఇక్బాల్పాషా, ఫజల్, కోటి రఘునాథరావు, చిరంజీవాచార్యులు, శివాజీ, ఆరేళ్ల రామాగౌడ్, రమాదేవి, రాధా, లీల, వెంకటరమణ, భాగ్యమలక్ష్మీ, మణిమాల, యశోద, గోపాల్, సంతోష్, హరికృష్ణ, గాంధీబాబు, సలీంపాషా పాల్గొన్నారు.
మెదక్లో గీతాలాపన సక్సెస్
మెదక్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం మెదక్ జిల్లాలో సక్సెస్ అయ్యింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఎక్కడికక్కడ ప్రజలు, యువకులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. నర్సాపూర్లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పాల్గొని జాతీయ గీతాన్ని పాడారు. మెదక్ పట్టణంలోని జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్ పాల్గొన్నారు.