మెదక్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మెదక్ కలెక్టరేట్లో మంగళవారం కవి సమ్మేళనం నిర్వహించారు. కవి సమ్మేళనంలో కవులు తమ కవితలు, పాటలను వినిపించి ఆహుతులను అలరింపజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ రమేశ్ మాట్లాడుతూ కవులు, కళాకారులను తెలంగాణ ప్రభు త్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందన్నారు. కవులు, కళాకారులు తమ ప్రతిభను వెలికి తీయడానికి ఆయా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను ప్రశంసా పత్రాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, జడ్పీ సీఈవో శైలేశ్, డీపీవో తరుణ్కుమా ర్, డీఎస్వో శ్రీనివాస్, డీడబ్ల్యూవో బ్రహ్మాజీ, ఇరిగేషన్ జిల్లా అధికారి శ్రీనివాస్రావు, మిషన్ భగీరథ అధికారి కమలాకర్, డీఈవో రమేశ్కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మెప్మా పీడీ ఇందిర, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్లో…
సంగారెడ్డి కలెక్టరేట్లో కవి సమ్మేళనం నిర్వహించారు. కవి సమ్మేళనానికి హాజరైన కవులు తమ కవి తా నైపుణ్యం చాటేందుకు పోటీ పడ్డారు. అక్షరాల గారడితో ఒకరిని మించి మరొకరు తమ ప్రతిభను చాటారు. కార్యక్రమానికి సంగారెడ్డి అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి హాజరై కవులను అభినందించారు. శాలువా, మెమొంటోలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవితా పాం డిత్యం కవుల ప్రతిభను చాటుందన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా కవి సమ్మేళం, షహేరా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాధికారమణి, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మావతి, జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్, ఆర్డీవో నగేశ్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.