నర్సాపూర్, ఆగస్ట్15: స్వర్గీయ వాకిటి లక్ష్మారెడ్డి ఆశయ సాధనకు ఎల్లప్పుడు కృషి చేస్తానని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం లక్ష్మారెడ్డి 23వ వర్ధంతి సందర్భంగా నర్సాపూర్లోని సాయికృష్ణ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. లక్ష్మారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనభరిచిన విద్యార్థులకు విద్యా వికాస్ అవార్డులు ప్రదానం చేశారు. రక్తదాన శిబిరంలో సుమారు 300 మంది అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, మాజీ ఎంపీపీ లలిత, టీఆర్ఎస్ నాయకులు సత్యంగౌడ్, తొంట వెంకట్ తదితరులు పాల్గొన్నారు.