సంగారెడ్డి, ఆగస్టు15: జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న 450 మంది అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అందజేశారు. రాధిక రమణి (డీఆర్వో), ఎల్లయ్య (జడ్పీ సీఈవో), జగదీశ్ (బీసీ సంక్షేమ అధికారి), రాజేశ్ (డీఈవో), వెంకటేశ్వర్లు (జిల్లా అటవీశాఖ అధికారి), సునీత (జిల్లా ఉద్యానవన అధికారి), గాయత్రీదేవి (డీఎం అండ్ హెచ్వో), సురేశ్మోహన్ (జిల్లా పంచాయతీ అధికారి), శ్రీనివాస్రావు (డీఆర్డీవో), అఖిలేశ్రెడ్డి (సాంఘిక సంక్షేమశాఖ అధికారి), శివలింగయ్య (రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్), ఫిరంగి (జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి), వసంత కుమారి (జిల్లా పశు సంవర్దకశాఖ అధికారి), మురళి (జిల్లా అభివృద్ది డిప్యూటీ డైరెక్టర్), బాబురావు (దళిత సంక్షేమశాఖ అభివృద్ధి), గీతా (మెప్మా పీడీ), మాధవరెడ్డి (విద్యుత్శాఖ జిల్లా అధికారి), అనురాధ (టీఎస్ఐఐసీ పటాన్చెరు), జగదీశ్వర్ (సంగారెడ్డి పంచాయతీరాజ్ ఇంజినీర్), సురేశ్ (ఆర్అండ్బీ జిల్లా అధికారి), వీర్ప్రతాప్ (పబ్లిక్ హెల్త్ ఇంజినీర్), మురళీధర్ (ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్), ప్రవీణ (తారా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్), విజయ్ కుమార్ (జిల్లా సైన్స్ అధికారి), సురేద్ర గురుంగ్ (ఎన్సీసీ 33 బెటాలియన్ కమాండెంట్), మెంచు నగేశ్ (సంగారెడ్డి ఆర్డీవో), రమేశ్ (జహీరాబాద్ ఆర్డీవో), అంబాదాస్ రాజేశ్వర్ (నారాయణఖేడ్ ఆర్డీవో), మల్లారెడ్డి (నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్), సుభాష్రావు (జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్)లకు పురస్కారాలు అందజేసి, అభినందించారు.
అర్బన్, మండల ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అందస్తున్న 14 మంది సిబ్బందికి ప్రశంసా ప్రత్రాలు అందజేశారు. రెవెన్యూశాఖలో 41 మంది, పంచాయతీ శాఖలో 42 మంది, పోలీసుశాఖలో 16 మందికి పురస్కారాలు అందజేశారు. మోడల్ రెసిడెన్షియల్ 10 పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పురస్కారాలు అందజేసి అభినందించారు. 5 ఉత్తమ మండలాలు ఎంపిక చేసి ఎంపీపీ, మండల అభివృద్ధి అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. జిన్నారం మండలం గడ్డపోతారం సర్పంచ్ ప్రకాశ్చారీకి, 30 పంచాయతీలను ఎంపిక చేసి ఉత్తమ పురస్కారాలు అందజేశారు. రవాణాశాఖలో 9 మందికి, 108, 102 ఉద్యోగులకు, ఆరోగ్యశ్రీలో సేవలందిస్తున్న 2, ఒక సామాజిక కార్యకర్త, ఇతర విభాగాలలో సేవలందస్తున్న 2కి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఎంఎన్ఆర్ దవాఖానకు అవార్డు
సంగారెడ్డి ఆగస్టు 15: సంగారెడ్డి మండలంలోని ఫసల్వాదిలో ఉన్న ఎంఎన్ఆర్ దవాఖాన ఆరోగ్యశ్రీ సేవలు అందజేయడంలో అగ్రభాగంలో ఉన్నందున అవార్డు లభించింది. వజ్రోత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఈ అవార్డును అందజేశారు. జిల్లాలో అత్యధికంగా 11 డిపార్టుమెంట్లలో ఆరోగ్యశ్రీ సేవలు అందజేస్తున్నారు. ఈ అవార్డును దవాఖాన సూపరింటెండెంట్ డా.భాస్కర్రాజుకు మంత్రి, కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, ఎస్పీ రమణకుమార్ అందజేశారు.