మెదక్/ సంగారెడ్డి న్యూస్ నెట్వర్క్, ఆగస్టు 11;వజ్రోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఆదివారం ఏడో రోజు ప్రజలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధుల, అధికారుల ఆధ్వర్యంలో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వాడవాడలా వేడుకలు నిర్వహించారు. రెండు కలెక్టరేట్లలో జానపద కళాకారులు, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇంటింటికీ ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాలతో అంతటా పండుగ వాతావరణం నెలకొన్నది. హైదరాబాద్ సైక్లిస్టు ఆధ్వర్యంలో సుచిత్ర నుంచి మూడు వందల మంది జాతీయ జెండాలతో వెల్దుర్తి మండలం మాసాయిపేట వరకు ర్యాలీ తీశారు. విద్యార్థులు, ప్రజలు భారీ జాతీయ జెండాలతో ఊరేగింపు చేపట్టారు. శివ్వంపేటలో మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ విద్యార్థులకు క్రీడాపోటీలను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా ఓడీఎఫ్లో గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు చీఫ్ జనరల్ మేనేజర్ సుధాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుమ్మడిదలలో వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించారు.
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా సాగుతున్నాయి. పండుగ వాతావరణంలో అంబరాన్నంటుతున్నాయి. ఊరూవాడ జాతీయ సమైక్యతను, స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతున్నాయి. 75 ఏండ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆదివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జాతీయ జెండాలు, బైక్ ర్యాలీలు, క్రీడలు, ధూంధాం కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సైకిల్ ర్యాలీకి ఘన స్వాగతం
వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది జాతీయ జెండాలతో 75 కిలో మీటర్ల జాతీయ సమక్యతా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్లోని సుచిత్ర నుంచి వెల్దుర్తి మండలం మాసాయిపేట వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి మనోహరాబాద్ మండలం కూచారంలో నాయకులు, నేచర్ ఐకాన్ యూత్ సభ్యులు ఘనస్వాగతం పలుకగా, తూప్రాన్ టోల్గేట్ వద్ద ఎస్ఐ రాజుగౌడ్ స్వాగతం పలికారు. జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో వాటర్ బాటిళ్లను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పురం రవి, ఉదయ్ రంజన్గౌడ్, నేచర్ ఐకాన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
కంటినిండా దేశభక్తి
మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వజ్రోత్సవ స్ఫూర్తిని చాటారు. స్వాతంత్య్ర భారత 75వ వజ్రోత్సవ సంబురాలను పురస్కరించుకుని పాఠశాల గణిత ఉపాధ్యాయుడు సత్యంపైసా తన అద్వితీయ మొబైల్ ఫొటోగ్రఫీ కళతో పదో తరగతి విద్యార్థిని సత్య కనుపాపల్లో త్రివర్ణ పతాకాన్ని బంధించారు.
అక్షర హారతి
ఆత్మ బలిదానాల పోరాట ఫలం జాగృత భారతావనికి వజ్రోత్సవ సంబురం దివ్య వైభవ ఆసేతు హిమాచల జయకేతనంకారణ జన్ముల సమర శంఖానాదం
అమరవీరుల త్యాగ నిరతి సందేశంమృగేంద్ర గర్జనయే స్వయం సమృద్ధి సమాహారం, సాత్పురా పర్వత పంక్తులు బాసింప వరలిని చిద్విలాసం మస్తకమున హిమరాజ విరాజిత మకుటం, మహోజ్వల భారత కీర్తికి దేశభక్తికి, ప్రణామం, ఉత్సవ శోభ నవనందన ఆనందానికి అక్షరహారతి వందేమాతరం, 75 సంవత్సరాల మువ్వన్నెల సంపూజ్యతకు,జయహో భారత్..
– డాక్టర్ పూర్ణకృష్ణ, కవి, వ్యాఖ్యాత సేకరణ: సంగారెడ్డి కలెక్టరేట్
మువ్వన్నెల జెండా
మువ్వన్నెలు విరిసిన వేళ శత వసంతాల హేల..మువ్వన్నెలు మురిసినవేళశతకోటి హృదయాల ఆనంద హేల స్వేచ్ఛా గాలుల ఊపిరిలో రెపరెపలాడే స్వాతంత్య్ర భారత కేతనం..కులమత భేదం లేని మూడు రంగులు అద్దుకొని జాతి ఘనత పెంచే పింగలి జెండా దేహామంతా దేశభక్తిలో తెల్లదొరలకు సిపాయి తిరుగు బాటుతో సింగమైన ఝాన్సీ నొప్పులు రానిది ఏ తల్లి ప్రసవించదని స్వేచ్ఛ నాహక్కు భిక్ష కాదన్న తిలక్ గుండెరగిలిన ఎర్రనిదారుల వెంట మన్యం వీరుడు అల్లూరి ఆవేశం విైల్లె సాగే బ్రిటీష్ గుండుకు గుండెను చూపే కేసరి వందేమాతరం గీతంలో ఉడుకు నెత్తురు రక్త గాయకులై ఊరికొయ్యల పై ఊపిరి వదిలే భగత్సింగ్ రాజ్ గురు సుఖదేవ్లు స్వతంత్య్ర భారత కాంక్ష స్వప్న మై గగనవీధుల్లో కనుమరుగై జైహింద్ అంటూ రాలే నేల ఎద పై మరో శివాజీ చేతి కర్రకు ఊత మిచ్చే..
జాతిభవితకు పితగా వచ్చే..శాంతి సహనంతో స్వాతంత్య్రం తెచ్చే గాంధీజీ..
– ఎం.కవిత, సీటీపల్లి, సేకరణ: మెదక్ రూరల్
భగత్ సింగ్ ఆజాద్ల త్యాగాల బీజం
నవభారత కేతనంజాతికిదే అంకితంబానిస శృంఖలాలనుతెంచుకున్న ఒక జాతిఇంతింతై వటుడింతైఎదిగిన రీతి..తిండి గింజ కోసంచేయి చాచే స్థితి నుంచి
అంతరిక్ష యానంపైఆధిపత్య స్థితి వరకు భరత జాతి ఎదుర్కొన్నఒడిదొడుకులు ఎన్నెన్నో భరతజాతి ఎదుర్కొన్న అడ్డంకులు మరెన్నో బుడిబుడి నడకలతోనే
ఒడిదొడుకులనదిగమించి ఆపే అడ్డంకులనే అవకాశంగా మలుచుకొని జాతి కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన తీరు రమణీయం.. కమనీయం..
సదా స్మరణీయం.
– అబ్దుల్ సాజిద్ పాష,ప్రధానోపాధ్యాయులు,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల,బొడ్మట్పల్లి సేకరణ: టేక్మాల్