శివ్వంపేట, ఆగస్టు14:శివ్వంపేటలో నిర్మిస్తున్న బగలాముఖి శక్తిపీఠం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందనుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం ఆలయంలో నిర్వహించిన లక్ష హరిద్రార్చన పూజా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శక్తిపీఠం నిర్మాణానికి ఎండోమెంట్ నుంచి రూ.50లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పూజలో పాల్గొన్నారు.
బగలాముఖి శక్తిపీఠం నిర్మాణంతో దేశంలోనే అత్యంత దివ్యక్షేత్రంగా శివ్వంపేట మారనున్నదని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం శివ్వంపేటలో నిర్మిస్తున్న బగలాముఖి శక్తిపీఠం బాలాలయం సన్నిధానంలో శక్తిపీఠం ఉపాసకుడు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్యక్షతన లక్ష హరిద్రార్చన పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవాదాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి దంపతులు హాజరయ్యారు. వేదపండితులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. వారు బాలాలయంలోని బగలాముఖి అమ్మవారిని దర్శించుకుని లక్ష హరిద్రార్చన పూజలో పాల్గొన్నారు. మేరుమంత్ర నిర్మాణాన్ని గోమయంతో నిర్మితం చేసి యంత్ర ప్రతిష్ఠాపన చేసి లక్ష నామాలతో పసుపుతో బగలాముఖి అమ్మవారిని అర్చించి, 108 మంది సువాసినులతో పూజించారు.
రూ.50 లక్షలు మంజూరు
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో శక్తిపీఠం నిర్మించడంతో రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శక్తిపీఠం నిర్మాణం కోసం ఎండోమెంట్ నుంచి రూ.50 లక్షల నిధులు అందించనున్నట్లు తెలిపారు. శక్తిపీఠం నిర్మాణ పనులు ఆగకూడదని, ఇంకా నిధులు అవసరమనుకుంటే మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డిలతో సీఎం కేసీఆర్ను కలసి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నిధులు మంజూరు కోరుతామన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రిని రాతి శిలలతో నిర్మించి తెలంగాణ తిరుపతిగా కీర్తిప్రతిష్ఠలు తెచ్చారని గుర్తు చేశారు. ఆలయానికి స్థలం దానం చేసిన పబ్బ రమేశ్గుప్తా, జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తాలను మంత్రి అభినందించారు. బగలాముఖి శక్తిపీఠం అమ్మవారి దయతో సీఎం కేసీఆర్ హయాంలో సమస్త ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని కోరారు.
తమ పూర్తి సహకారం అందిస్తాం
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి మాట్లాడుతూ బగలాముఖి శక్తిపీఠం తమ నర్సాపూర్ నియోజకవర్గంలో నిర్మించడం అదృష్టమని, అమ్మవారి కృపతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి తమవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి సమక్షంలో శ్యాంప్రసాద్రెడ్డి రూ.18 లక్షలు విరాళం ప్రకటించి, మొదటి విడుతగా రూ.5 లక్షలు అందజేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి రూ.3 లక్షలు ఇచ్చారు. అనంతరం ఆలయం ఎదుట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ బహూకరించిన రుద్రాక్ష మొక్కను మంత్రి నాటారు. జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయ అశోక్గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, హైకోర్టు సీనియర్ న్యాయవాది శివకుమార్గౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, సర్పంచ్ పత్రాల శ్రీనివాస్గౌడ్, శక్తిపీఠం ట్రస్టు సభ్యుడు పురుషోత్తంశర్మ, గొర్రె వెంకట్రెడ్డి పాల్గొన్నారు.