తూప్రాన్/రామాయంపేట, జనవరి 29 : మండలవ్యాప్తంగా ఇప్పటివరకు 720 బూస్టర్ డోస్ టీకాలు ఇచ్చామని తూప్రాన్ ప్రభుత్వ వైద్యుడు ఆనంద్ తెలిపారు. శనివారం తూప్రాన్ పట్టణంలో నాలుగు బూస్టర్ టీకాల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెకండ్ డోస్ తీసుకొని 9 నెలలు పూర్తి చేసుకున్న వారు బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలని సూచించారు. ప్రజలందరూ వైద్య సిబ్బందికి సహకరించి బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది కృష్ణ, శారద, బాలనర్సయ్య, పల్లవి పాల్గొన్నారు.
రామాయంపేట మున్సిపాలిటీలో…
రామాయంపేట మున్సిపాలిటీలోని ఐదో వార్డులో వైద్య ఆరోగ్య శిబిరం కొనసాగుతున్నది. అర్హులైనవారికి వైద్య సిబ్బం ది బూస్టర్ డోస్ టీకాలు వేశారు. 15 ఏండ్లు పైబడినవారు కొవి డ్ టీకా తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూపర్వైజర్ సునంద సూచించారు. కార్యక్రమంలో ఐదో వార్డు కౌన్సిలర్ శోభాకొండల్రెడ్డి, ఏఎన్ఎం యశోద, నిర్మల, ఆశవర్కర్లు పాల్గొన్నారు.